మసూద్‌ చనిపోయాడని వస్తున్న వార్తలపై… పాక్ ప్రభుత్వం స్పందించడం లేదు ఎందుకు?

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ చనిపోయాడా? మసూద్ మరణించాడంటూ వస్తున్న వార్తలపై పాక్ ప్రభుత్వం స్పందించడం లేదు. మసూద్ పాక్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని అమెరికాకు చెందిన ఓ వార్త పత్రిక కథనం ప్రచురించింది.

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ చనిపోయాడా? ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

దీనిపై పాక్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు

జైషే మహ్మద్ చీఫ్, పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ చనిపోయినట్లు తెలుస్తోంది.

మసూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇంటి నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నాడని రెండ్రోజుల క్రితమే పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే బాలాకోట్‌లోని ఉగ్రవాద శిభిరాలపై భారత వాయుసేన జరిపిన సర్జికల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడని కొందరు, అనారోగ్యం కారణంగా శనివారం చనిపోయాడని మరికొందరు చెబుతున్నారు.

మసూద్ చనిపోయాడని సోషల్‌మీడియా కోడై కూస్తోంది.

మసూద్ మరణించాడంటూ వస్తున్న వార్తలపై పాక్ ప్రభుత్వం స్పందించడం లేదు. మసూద్ పాక్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని అమెరికాకు చెందిన ఓ వార్త పత్రిక కథనం ప్రచురించింది.

పాక్ ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయనుందని కూడా తెలిపింది.

అయితే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చేస్తున్న వాదనను పక్కదోవ పట్టించేందుకు పాక్ ఇలాంటి ప్రచారం చేస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు తమ అధినేత బతికే ఉన్నాడని జైషే మహ్మద్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు మసూద్ చనిపోయాడని తెలిస్తే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఢీలా పడిపోయే అవకాశం ఉన్నందున అతడి మరణవార్తను బయటకు రానివ్వడం లేదన్న వాదనా ఉంది.

మసూద్ మరణ వార్తలపై వస్తున్న కథనాలపై తనకేమీ తెలీని పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *