ఎమ్మెల్యే రోజా ఇటీవలే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు…

ఎమ్మెల్యే రోజా ఇటీవలే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యాయస్థానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి భూకుంభకోణంలో ఓ లాయర్‌పై కేసు వేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం దారుణమన్నారు.

అలాగే అమరావతి కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేస్తే టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు గజగజా వణుకుతున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు.

ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో భారీ కుంభకోణం జరగింది.

రాజధాని పేరుతో బాబు, ఆయన బినామీలు వేల ఎకరాలు కొనుగోలు చేశారు. టీడీపీ పాలనలో పెద్ద కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణం మీద ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేస్తే గజగజ వణుకుతున్నారు.

భూకుభకోణానికి సంబంధించి మాజీ అడ్వొకేట్ జనరల్‌పై కేసు నమోదు చేస్తే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం బాధాకరమని, ఇదిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందన్నారు.

జాతీయ మీడియాతో పాటు మేధావులు సైతం హైకోర్టు ఉత్తర్వులపై విస్మయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

భూకుంభకోణానికి సంబంధించి అన్ని ఆధారాలతో ఏసీబీ కేసు నమోదు చేసిందన్నారు. అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని వెల్లడించారు.

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారని ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు మాత్రం ఇప్పుడు తేలుకుట్టిన దొంగలా ఉన్నారన్నారు.

చంద్రబాబుకు దమ్ముంటే ఇప్పుడు అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ అక్రమాల మీద సీబీఐ విచారణ కోరాలని ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు.

అంతర్వేది ఘటనలో ప్రభుత్వం తప్పు లేకపోయినా సీఎం జగన్ సీబీఐ విచారణ కోరారన్నారు.

చంద్రబాబు స్టేలతో బతుకుతున్న వ్యక్తి అని ఎద్దేవా చేశారు. కోర్టులు కూడా అందరికీ ఒకేలా న్యాయం చేయాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *