హైదరాబాద్‌లో తొలి డాఖినీ పార్క్‌.. ప్రత్యేకతలు

హైదరాబాద్‌లో తొలి డాఖినీ థీమ్ పార్క్‌ ఏర్పాటు కానుంది.ఆరు ఎకరాల విస్తీర్ణంలో మీర్ ఆలం చెరువు పక్కనే ఈ పార్కును నిర్మించనున్నారు.నిజాం కాలం నాటి కళలు, చిత్రాలతో ఈ పార్క్ రూపుదిద్దుకోనుంది.

హైదరాబాద్‌‌లో తొలి డాఖినీ థీమ్ పార్క్ ఏర్పాటుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. నిజాం కాలం నాటి కళలు, పెయింటింగ్‌లతో ఆరు ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు.

మీర్ ఆలం చెరువు పక్కనే ఈ పార్కు ఏర్పాటు కానుంది.

ఈ పార్క్ ఏర్పాటు కోసం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డాఖినీ పార్క్‌ ఏర్పాటు కోసం కృషి చేశారు.

జంతు ప్రదర్శనశాలకు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతానికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

ఇక్కడి వచ్చే సందర్శకులు నిజాం కాలం నాటి పెయింటింగ్‌లు, డిజైన్లను తిలకించడానికి సందర్శకులు తారామతి, గోల్కొండ కోటకు వెళ్తుంటారు.

థీమ్ పార్క్ ఏర్పాటుతో నెహ్రూ జూ సమీపంలోనే సందర్శకులు నిజాం కాలం నాటి పెయింటింగ్‌లను కూడా వీక్షించొచ్చు.

మొఘల్, దక్షిణ భారత కళల మేళవింపుగా నేటి కాలానికి తగ్గట్టుగా ఈ పెయింటింగ్‌లు ఉంటాయి. రూ.1.5 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకోనున్న ఈ పార్కులో ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది.

పిల్లలకు మ్యాథ్స్, సైన్స్ పట్ల అవగాహన కల్పించేలా కూడా ఈ పార్క్‌‌లో ఏర్పాట్లు చేయనున్నారు.

‘డాఖినీ సంస్కృతిని ఏఐఎంఐఎం అవలంబిస్తోంది. మీటింగులు, వస్త్రాధారణలో నిజాం కాలం నాటి సంస్కృతిని అనుసరిస్తున్నాం.

నా ప్రతినిథ్యంలో హైదరాబాద్‌లో ఆరు ఎకరాల్లో డాఖినీ థీమ్ పార్క్ రూపుద్దికోనుంది

. మీర్ ఆలం చెరువు పక్కనే ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు’ అని ఫేస్‌బుక్ ద్వారా అసుద్దీన్ ఓవైసీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *