సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

శ్రీలక్ష్మి వరాహనృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి, అభిషేకం నిర్వహిస్తారు.

ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీలక్ష్మి వరాహనృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి, అభిషేకం నిర్వహిస్తారు.

అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు.

ఈ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుని, స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత.

‘యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం’ అంటే అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణుసాన్నిధ్యం కలుగుతుందని అర్థం.

ఇదియే అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరపిస్తారు.

ఈరోజు చేసే జప,తప,హోమ,తర్పనాదులు అక్షయమై పుణ్యఫలానిస్తాయని, అక్షయ తృతీయ బుధవారం, రోహిణి నక్షత్రంతో కూడి వచ్చిన అనంత ఫలమని అంటారు.

కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. రాక్షస రాజులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల క్రూరస్వభావం ముల్లోకాలను గడగడలాడించింది.

హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలో భూదేవిని చెరబట్టి చాపలా చుట్టి తీసుకుపోయడాని పురాణాలు వివరిస్తున్నాయి.

అంతటి దుర్మార్గుడిని శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి సంహరించాడు.

తన సోదరుడు హిరణ్యాక్షుని చంపిన శ్రీహరిపై కక్ష పెంచుకున్న హిరశ్యకశిపుడు ఘోరం తపస్సు చేసి తనను మించిన అజేయుడు ముల్లోకాల్లో ఉండరాదని, తనకు మరణమన్నదే లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు.

హిరణ్యకశిపుడు ఘోర తపస్సుకి భయపడి దేవతలంతా ఇంద్రుడి వద్దకు వెళ్లి ఏదైనా ఉపాయం ఆలోచించాలని సూచించారు.

అతడి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇదే సమయంలో హిరణ్య కశిపుని భార్య లీలావతి గర్బవతి అన్న విషయాన్ని ఇంద్రుడు గ్రహించాడు.

హిరణ్యకశిపుడే ఒక పెద్ద సమస్య అంటే, ఇంకా అతడికి కొడుకు పుడితే వారు ఇద్దరూ దేవతలను ఇంకా హింసిస్తారని, తన సింహాసనానికి ముప్పని భావించాడు.

మాయా రూపంలో లీలావతి దగ్గరకు చేరి ఆమెను దేవలోకానికి తీసుకొని పోతుండగా, దారిలో నారద మహర్షి కనిపించి ఇంద్రుని వారించాడు.

ఓ గర్భిణినిచెరబెట్టి తీసుకుపోతావా? ఇంతనీచానికి దిగాజారుతావని నేననుకోలేదని గద్దించాడు.

తాను దురుద్దేశంతో అలా చెయ్యడం లేదని దేవతల క్షేమం కోసం అలా చెయ్యాల్సి వచ్చిందని ఇంద్రుడు సమాధానం ఇచ్చాడు.

అయితే, ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదని, ఒక గొప్ప హరి భక్తుడనే విషయాన్ని వెల్లడించాడు.

ఆ తరువాత లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. పుట్టుకతోనే హరి భక్తుడైన ప్రహ్లాదుని మనసు మార్చడానికి హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నమంటూ లేదు.

సామ బేధ దండోపాయంతో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుమారుని సముద్రంలో పడవేయించి, పైకి లేవకుండా పర్వతాన్ని వేయించాడు. అయితే, శ్రీహరి వచ్చి తన భక్తుడిని రక్షించుకున్నాడు.

ఆ సముద్రమే విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం. ఆపైన వేసిన పర్వతమే సింహాచలం. హిరణ్యకశిపుని చంపిన విచిత్రావతారమే నరసింహావతారం.

ప్రహ్లాదుని కోరికమేరకు హిరణ్యాక్షుని సంహరించిన వరహామూర్తి, హిరణ్యకశిపుని చంపిన నరసింహ మూర్తి లక్ష్మీదేవితో కలిసి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానని అభయమిచ్చాడు.

స్వామిరూపం సింహాచలంలో వరాహ ముఖం, నరుని ( తెల్ల ) శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, రెండు చేతులు, భూమిలో దాగివున్నపాదాలు..

ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటలు సేపు చందనం తొలగించగా దొరుకుతుంది.

ఆ వేళకు లక్షలాది మంది వచ్చి భక్తులు వచ్చి స్వామిని దర్శించి తరిస్తారు.

టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుని, మళ్లీ అర్చనాదులు పూర్తిచేసి, దర్శన భాగ్యం భక్తులకు కల్పించి తిరిగి చందనం లేపనం చేయడం, తరువాత స్వామీ శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక.

పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి అది ఆగిపోతుంది.

దీంతో ఊర్వశి తన దివ్యదృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది.

ఆ రాత్రికి వీరు అక్క డే బస చేయగా సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రినాథుడు పురూరవ చక్రవర్తికి కలలో సాక్షాత్కరించి తాను ఇక్కడే కొలువై వున్నానని, వెలికి తీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరాడు.

స్వామి కలలో చెప్పినట్టు పురూరవ చక్రవర్తి సింహగిరి లోయలోని ఎంత వెదికినా ఫలితం ఉండదు.

రెండో రోజు స్వామి మరో సారి దివ్యవాణితో తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని, వెలికి తీయాలని ఆదేశించాడు.

దీంతో స్వామి విగ్రహాన్ని వెలికి తీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది.

స్వామి 12 అడుగుల పుట్టలో లభ్యంకావడంతో అందుకు తగినట్టుగానే ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని (500 కేజీలు) సమర్పిచడం జరుగుతుంది

సింహాచలం స్వామి నిజరూపదర్శనం.. పోటెత్తిన భక్తులు, ప్రముఖులు

సింహాచలంలో వరాహ ముఖం, నరుని శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, రెండు చేతులు, నెలలో దాగివున్నపాదాలు,

ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటలు సేపు దొరుకుతుంది.

వైభవంగా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం.
స్వామి నిజరూపదర్శనం కోసం సింహాచలానికి ప్రముఖులు.
తెల్లవారుజాము నుంచి పోటెత్తిన భక్తులు, భారీ ఏర్పాట్లు.

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామికి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు చందనోత్సవాన్ని నిర్వహిస్తారు.

ఏడాది పొడువునా చందనంతో కప్పి ఉండే స్వామివారు ఈ ఒక్క రోజు మాత్రం నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు.

స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు సింహగిరికి తరలివస్తారు.

ఈ ఏడాది వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయను పురస్కరించుకుని మంగళవారం చందనోత్సవం జరుగుతోంది.

లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవంలో భాగంగా సింహాచలేశుని మంగళవారం తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవతో మేల్కొలిపి గంగధార నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు.

ఆ తరువాత బంగారు, వెండి బొరిగెలతో స్వామి దేహంపై కప్పి ఉంచిన చందనాన్ని తొలగించారు.

ప్రత్యేక పూజల నిర్వహించి స్వామి శిరస్సు, వక్షస్థలంపైన రెండు పచ్చి చందనపు ముద్దలను ఉంచారు.

అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి వంశానికి చెందిన అశోక్‌గజపతి రాజు కుటుంబసమేతంగా తొలి పూజ చేశారు.

ఆ తరువాత వీవీఐపీ, ప్రోటోకాల్‌ దర్శనాలు ప్రారంభమయ్యాయి. స్వామి దర్శనం కోసం పలువురు ప్రముఖులు సింహగిరికి విచ్చేశారు.

హోం మంత్రి చినరాజప్ప, డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఎంపీ అవంతీ శ్రీనివాస్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తదితరులు స్వామిని దర్శించుకున్నారు.

ఉదయం 4 గంటల నుంచి సామాన్య భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు సింహగిరికి పోటెత్తారు. దాదాపు 2000 మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగక్కుండా నిఘా పెంచారు.

అలాగే తొలిసారిగా తీవ్రవాద నిరోధక దళాలను మోహరించారు. బ్యాగేజ్‌లను ఆలయ పరిసరాల్లోకి అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు.

మరోవైపు, స్వామి దర్శనానికి వచ్చే సామాన్యులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. గంటకు 12 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకునేలా క్యూలైన్లు, ఎండ నుంచి తట్టుకునే చలువ పందిళ్లు నిర్మించారు.

క్యూలైన్‌లో భక్తులు దాహం తీర్చేందుకు మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, అన్న ప్రసాదాల పంపిణీకి సిద్ధంగా ఉంచారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. గతేడాది చందనోత్సవానికి లక్షా 80 వేల మంది భక్తులు రాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 2 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *