ఫిబ్రవరి 1న ఏపీ బంద్ కి పిలుపునిచ్చిన హోదా సాధన సమితి

ఆంధ్ర ప్రదేశ్లో మరోసారి హోదా సెగ మొదలయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది మరింత వేడెక్కింది. టిడిపి అయితే ఇదే కారణంతో NDA నుండి బయటికి వచ్చిన విషయం తెలిసిందే.

అటు జగన్ మరియు పవన్ ఇద్దరూ కూడా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు.

ఇక వామపక్ష పార్టీల మద్దతుతో ఏర్పడిన హోదా సాధన సమితి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 1 న ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది.

A P కి ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 1న హోదా సాధన సమితి బంద్ నిర్వహించాలని నిర్ణయించారు.

ఇప్పటికే అనేక ఆందోళన కార్యక్రమాలు చేసిన తాము ఎన్నికల ముందు కేంద్రం పై ఒత్తిడి పెంచే క్రమంలో బంద్ కు పిలుపునిచ్చినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపై ఢిల్లీలో ఆందోళన జరిపారు. అక్కడి పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు నిరసన తెలపాలని భావించారు.

కానీ ప్రధాని పర్యటన వాయిదా పడే సరికి కేంద్ర బడ్జెట్ జరిగే రోజు ఆంధ్ర ప్రదేశ్లో బంద్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ బందుకు సహకరించాలని అన్ని పార్టీ నేతలను కూడా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *