వైసిపి అడ్డా కడపలో చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ
కడప YSR కాంగ్రెస్ పార్టీ అడ్డా అని చెబుతారు. కానీ YCP కి కడపలో జీరో స్థానాలు వస్తాయని విమర్శిస్తున్నారు తెలుగుదేశం నాయకులు.
ఏకంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా పులివెందులలో జగన్ కి ఓటమి తప్పదని, పులివెందుల లో ఓటమి చూపిస్తామని అంటున్నారు.
అయితే జగన్ సొంత ప్రాంతం కాబట్టి అక్కడ వైసీపీకి రెస్పాన్స్ ఉంటుంది.
కానీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత కడప బాగా అభివృద్ధి చెందింది. వివిధ ప్రాజెక్టులు త్వరితగతిన జరుగుతున్నాయి.
నీటి సమస్యలు సమసిపోయేలా కార్యాచరణలు జరిగాయి. ఉక్కు ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అయింది. ఇలా అనేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
కడపలో వైసిపి నాయకులు పుష్కలంగా ఉన్నప్పటికీ, అదే నాయకులు వైసిపికి తలనొప్పి తెచ్చిపెడుతున్నారు. ఒక్కోచోట సీటు కోసం ఇద్దరు ముగ్గురు పోటీపడటంతో పార్టీలో పరిస్థితులు పూర్తిగా భిన్నం గా మారిపోతున్నాయి.
కానీ జిల్లాలో వైసీపీ నేతల మధ్య పోరు బయటకు రావడం లేదట.
“పార్టీ మారబోను, మారే ఉద్దేశమే లేదు, చంద్రబాబును కలిసిన తర్వాతే భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తాం” అని చెప్పి మేడ పార్టీ మారాలి అని తన నిర్ణయాన్ని తీసుకున్నాడు. అటువంటి వారిని పార్టీలో ప్రోత్సహించేది లేదని అందుకే వెంటనే సస్పెండ్ చేసినట్లు బాబు చెప్పారు.