ఏపీలో మొదలు కాబోతున్న ఎన్నికల రణరంగం
ఏపీలో ఎన్నికల వేడి మొదలవుతుంది.
ఎన్నికల పనులు మొదలవుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ వూహ కమిటీ తో మీటింగ్ నిర్వహించారు.
అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఇప్పటి నుంచె ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి ఎవరైతే బలంగా తీసుకెళ్లి దగ్గరవుతున్నారొ వారికే సీట్లు దక్కుతాయని అన్నారు.
అంతేకాదు తాను చేయించుకుంటున్న సర్వేల ప్రకారం సీట్లు ఇస్తాం అని అనడంతో పాటు ,కొంతమందికి మార్పు అవుతారని సంకేతాలు ఇచెవిధంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం పై కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.
కేంద్రం సాయం లేకపోయినా రాష్ట్రనికి నిధుల కొరత ఉన్న కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధి చేస్తున్నామని.
ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేతలతో ముఖ్యమంత్రి చెప్పారు.
ఇంకొక పక్క ఎన్నికల అధికారి సి పొడియా కూడా ఓ ప్రకటన చేశారు ఏపీలో ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామని, ఈవీఎంలకు సంబంధించిన పనులు కూడా మొదలవుతునాయాని ఆయన చెప్పారు.
ఫిబ్రవరి మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిజానికి ఇవి షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న ఎన్నికలే, కాకపోతే, ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టకపోతే అప్పటికి పూర్తి కావు ఏదేమైనా ఏర్పాట్ల గురించి ఎన్నికల అధికారి పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాడoలొ ఎన్నికలు హిట్ మొదలైనట్లే.
ప్రతిపక్ష నేత జగన్ అయితే పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఎన్నికల వేడి లోనే ఉంటున్నారు. జనసేన అధినేత పవన్ కూడా యాత్ర పేరుతో ఎన్నికలే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.