చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదు: మోహన్బాబు
మాట నిలబెట్టుకోలేదు: మోహన్బాబు
విద్యాభివృద్ధి విషయంలో ఏపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని మోహన్బాబు విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
1.ఏపీ సీఎం చంద్రబాబుపై సినీనటుడు మోహన్బాబు విమర్శలు గుప్పించారు.
2.విద్యాభివృద్ధి విషయంలో ఏపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సినీనటుడు మోహన్బాబు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని, విద్యాభివృద్ధి అంశంలో ఏపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
తిరుపతిలో ఆయన మాట్లాడుతూ… తాను నిర్వహిస్తున్న విద్యానికేతన్ విద్యార్థులకు 2014-15 నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
టాప్ వ్యాఖ్య
మాట నిలబెట్టుకోని చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రమంతా తిరుగుతూ అమలుకాని హామీలు ఎందుకిస్తున్నారని మోహన్బాబు ప్రశ్నించారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటడంతో పార్టీ ముద్ర వేసే అవకాశముందని, తాను ఏ పార్టీలోనూ లేనని స్పష్టం చేశారు.
తన వ్యాఖ్యలు వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదని చెప్పారు. మోహన్బాబు వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.