కెసిఆర్ అనే నేను రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం

ఏకైక మంత్రిగా ఆలీ మహమూద్ అలీ:
హైదరాబాద్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో తెలుగు రాష్ట్రంలో గవర్నర్ నరసింహన్ ప్రయాణ స్వీకారం చేయించారు. మధ్యాహ్నం సరిగ్గా 1:25 గంటలకు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ‘కేసీఆర్ అనే నేను’ అంటూ తెలుగులో ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహమ్మద్ అలీ ఉర్దూలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ హరీశ్ రావు తో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు, మహమ్మద్ అలీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు నూతన ఎమ్మెల్యేలు , టీఆర్ఎస్ ఎంపీలు, మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ , ఇతర ప్రముఖులు తరలివచ్చారు.
అప్పుడు 11… ఇప్పుడు ఒక్కరే తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2014 జూన్ 2న ప్రమాణస్వీకారం చేశారు అప్పుడు ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఈసారి అందుకు భిన్నంగా కేసీఆర్తోపాటు మహమ్మద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తొలిసారి 11మంది ప్రమాణం చేసినప్పుడు కూడా వారిలో మహమూద్ అలీ ఉండటం గమనార్హం.