ఇది శాంపిలే.. పాక్‌ను తగలబెట్టాలి: రాజా సింగ్‌

పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తామని మోదీ చెప్పారు.. అన్నట్లే చేశారు. ఈ దాడులు జరిపిన భారత సైన్యానికి, ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు.

పాక్‌కు బాగా బుద్ధి చెప్పారంటున్న రాజాసింగ్ఇది శాంపిలే.. పాక్‌ను తగలబెట్టాలన్న రాజాసింగ్ఆ సమయం కూడా త్వరలో వస్తుందన్న బీజేపీ ఎమ్మెల్యే

పుల్వామాపై దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది.

దెబ్బకు దెబ్బ తీస్తూ.. ముష్కర మూకల్ని అంతం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 300 మంది తీవ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.

దాయాది దేశంపై మెరుపు దాడుల్ని యావత్ భారతం స్వాగతిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా వాయుసేనకు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా వాయుసేనకు సెల్యూట్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

ముష్కరమూకల అంతంపై, వైమానిక దళం జరిపిన దాడులపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ స్పందించారు.

వాయుసేనపై ప్రశంసలు కురిపిస్తూ వీడియోను విడుదల చేశారు. ‘ఉదయం మన భారత సైన్యం పాకిస్తాన్‌‌పై.. దాదాపు వెయ్యి కేజీల బాంబును పేల్చి వచ్చింది.

పుల్వామా దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పిస్తామని మోదీ చెప్పారు.. అన్నట్లే చేశారు. ఈ ఘటనపై భారత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పాక్‌కు భారత సైన్యం సరైన రీతిలోనే సమాధానం చెప్పింది. భారత ప్రజలకు అభినందనలు.. ఈ దాడులు జరిపిన భారత సైన్యానికి, ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు. ఇది శాంపిల్‌ మాత్రమే.. పాక్‌ను మొత్తం తగలబెట్టాలి. ఆ సమయం కూడా త్వరలో వస్తుంది.’అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *