జనసేనకు వరుస షాకులు.. పార్టీకి గుడ్ బై చెప్పిన సత్యనారాయణతో పాటూ సతీమణి పద్మావతి కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.

1.జనసేనకు సీనియర్ నేత గుడ్ బై.. వైసీపీలోకి!

జనసేనకు వరుస షాకులు.. పార్టీకి గుడ్ బై చెప్పిన మరో సీనియర్ నేత. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆకుల సత్యానారాయణ. వైసీపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం.

జనసేనకు మరో సీనియర్ నేత షాకిచ్చారు. పార్టీకి, పదవికి చింతల ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖను అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ కార్యాలయానికి పంపించారు. సత్యనారాయణతో పాటూ సతీమణి పద్మావతి కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.

ఆకుల రాజీనామాకు సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది. ఎన్నికల్లో రాజమండ్రి నుంచి జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన సత్యనారాయణ ఓడిపోయారు.. ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

జనసేనకు రాజీనామా చేసిన ఆకుల సత్యనారాయణ ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ మొదలయ్యింది.

గతంలోనే ఆయన జనసేనకు గుడ్ బై చెప్పి మళ్లీ బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. తాజాగా సత్యనారాయణ వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే చర్చ జరుగుతోంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన జగన్.. కాపు సామాజిక వర్గ నేతల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

ఇటీవలే తోట త్రిమూర్తులు కూడా పార్టీలో చేరారు. ఇప్పుడు ఆకుల కూడా అధికార పార్టీలోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం నడుస్తోంది.

ఇదిలా ఉంటే జనసేన పార్టీకి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే జనసేన పార్టీ ముఖ్యనేత చింతల పార్థసారధి కూడా పార్టీకి రాజీనామా చేశారు.

త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఎన్నికల ఫలితాల తర్వాత జనసేనకు చాలామంది నేతలు దూరమయ్యారు.

ఇలా నేతలు వరుసగా పార్టీని వీడుతుండటం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవరపెడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *