డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం.. కడప సభలో జగన్ హామీ

డ్వాక్రా సంఘాలకు ఎన్నికలకు వరకు ఉన్న రుణాలు.. నాలుగు దఫాలుగా మాఫీ చేస్తాం. అలాగే మహిళలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. . రేషన్ సరుకుల్ని ఇంటికే డోర్ డెలివరీ చేస్తాం.

ప్రధానాంశాలు

స్కూల్‌కు వెళ్లే ప్రతి పిల్లవాడినికి ఏడాదికి రూ. 15 వేలుప్రతి

మే నెలలో రైతులకు రూ. 12,500 ఇస్తాం

ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తాం అని జగన్ హామీ

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామన్నారు వైసీపీ అధినేత జగన్. కడపలో జరిగిన వైసీపీ సమర శంఖారావం సభలో జగన్ ఈ హామీ ఇచ్చారు.

అలాగే ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లే ప్రతి పిల్లవాడికి ఏడాదికి రూ. 15 వేలు సాయం అందిస్తామన్నారు జగన్.

ప్రతి మే నెలలో రైతులకు రూ. 12,500 ఇస్తామని హామీ ఇచ్చారు.45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 75 వేల రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి అవ్వ, తాతకు పింఛన్ రూ.3వేలకు పెంచుతామన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు.

జగన్ ఇచ్చిన హామీలకు ప్రజలు జై జగన్ అంటూ ,జగనన్న గెలిపిస్తాం, జగన్తో నడుస్తాం ప్రజలు నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *