శ్రీశైలం లోయలోకి దూసుకెళ్లిన బస్సు తూటిలో తప్పిన ప్రమాదం

శ్రీశైలం ఆలయం కర్నూలు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి దైవ దర్శనానికి వస్తున్న భక్తులు బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో లోయలోకి దూసుకెళ్లింది, ఈ సంఘటన శ్రీశైలం ఘాట్ రోడ్ లోని చిన్న రూట్ల మలుపు వద్ద ఆదివారం చోటు చేసుకుంది, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని బీడు జిల్లా పేరాల కి చెందిన 36 మంది ప్రయాణికులు టూరిస్ట్ బస్సు లో శ్రీశైలం యాత్ర కు వస్తున్నారు, ఆదివారం ఉదయం 6 గంటలకు దోర్నాల అటవీశాఖ టోల్గేట్ దాటిన బస్సు శ్రీశైలానికి 15 కిలోమీటర్ల దూరంలోని చిన్న రూట్ల మలుపు వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదం నుండి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు, సమాచారం అందుకున్న శ్రీశైలం దోర్నాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *