పుల్వామా దాడి.. జవాన్ల పేర్లు టాటూ వేయించుకున్న యువకుడు

ఫిబ్రవరి 14న పుల్వామాలో జవాన్లపై జరిగిన మారణహోమాన్ని చూసి చలించిపోయాడు. ఈ ఘటనలో అమరులైన జవాన్లతో సహా మొత్తం 71 మంది వీర జవాన్ల పేర్లను తన వీపుపై టాటూ వేయించుకునడు.

సైనికులకు వినూత్నంగా నివాళులు అర్పించిన యువకుడు

జవాన్లను జీవింతాంతం గుర్తు పెట్టుకోవాలనే టాటూ అంటున్న యువకుడు

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశం మొత్తం ఘన నివాళి అర్పించింది. ముష్కర మూకల దాడిని ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించింది.

బాధిత కుటుంబాలకు అండగా మేమున్నామంటూ భరోసా నింపే ప్రయత్నం చేశారు. రాజస్థాన్‌లో మాత్రం ఓ యువకుడు సరికొత్తగా ఆలోచించాడు. అమర జవాన్లకు భిన్నంగా నివాళులు అర్పించాడు.

బికనూర్ జిల్లాకు చెందిన గోపాల్ సహరన్ అనే యువకుడు భగత్ సింగ్ యూత్‌లో బ్రిగేడ్. ఫిబ్రవరి 14న పుల్వామాలో జవాన్లపై జరిగిన మారణహోమాన్ని చూసి చలించిపోయాడు.

జాతీయ పతాకం, జవాన్లు పెట్టుకునే టోపీ, తుపాకీ, షూను కూడా పచ్చబొట్టుగా వేయించాడు.

యువతను స్ఫూర్తి వంతులుగా చేసేందుకు అమర వీరులకు ఇలా నివాళుల అర్పించానన్నాడు గోపాల్. దేశం కోసం ప్రాణాలర్పించి వీర జవాన్లను జీవింతాంతం గుర్తు పెట్టుకోవాలనే ఇలా టాటూ వేయించుకున్నట్లు చెప్పాడు.

సైనికులకు ఈ దేశ ప్రజలు ఇస్తున్న గౌరవాన్ని మరింత పెంచిన వ్యక్తిగా గర్వపడుతున్నానని.. తనవైపు నుంచి అమర జవాన్లకు అర్పించే నివాళి అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *