వైరస్ ఇంటిలోకి రాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని..ఏపీ ప్రజలకు జగన్ సర్కార్!

కరోనా ఎఫెక్ట్: ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ అలర్ట్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వైరస్ ఇంటిలోకి రాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
కొన్ని సూచనలు పాటించాలని.. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనాను కట్టడి చేయొచ్చంటోంది.
కొన్ని సూచనలు పాటించాలని.. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనాను కట్టడి చేయొచ్చంటోంది.
ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. రోజువారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి.

- రోజు ఉదయాన్నే మీ ఇంటి డాబా, ఇంటి బయట ఎండలో 20 నిమిషాల పాటూ శ్వాస వ్యాయామాలు.. యోగా చేయడం మంచిది.
- ఇంట్లో ప్రతి ఒక్కరూ గోరు వెచ్చని నీరు మాత్రమే తాగాలి. అది ప్రతి అర గంటకు ఒకసారి కొద్ది కొద్దిగా 5 లీటర్ల వరకు తాగాలి.
- ఆయుర్వేదంలో సూచించిన విధంగా అల్లం, వెల్లుల్లి, మిరియాలు, శొంఠి, పసుపు, లవంగాలు, మిరియాలు నీటిలో బాగా మరిగించి రెండు, మూడు పూటలా తాగాలి.
- రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో చిటికెడు పసుపును కలుపుకుని తాగండి.
- మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలు, పెద్ద వాళ్ళే మనకు విలువైన ఆస్తి. వారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది.. ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
- శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి బలమైన ఆహారమైన కోడిగుడ్డు, పాలు, బాదం, జీడిపప్పు, కిస్మిస్ తింటే మంచిది. రాగి జావ అంబలి తాగాలి.
- బీపీ, షుగర్ వంటి అత్యవసరమైన మందులతో పాటు ఇంట్లో తప్పనిసరిగా ఇవి ఉండాలి..
A. పారాసెటమాల్
B.సిట్రేజిన్
C.Cough Tabs,
D.మౌత్ వాష్, గార్గిల్ కోసం బీటాడిన్
E.విటమిన్ సి,డి3
F.బీ కాంప్లెక్స్ Zincovit 7.ఆవిరి కోసం జండూ బామ్,పసుపు ఉండాలి. - ఆఫీసులు, ఉద్యోగ ప్రాంతం, రద్దీ ప్రాంతాల్లో నుంచి ఇంటికి వస్తే తప్పనిసరిగా ఇంటి బయటే మొబైల్, తాళాలు, పర్సులను శానిటైజర్తో శుభ్రం చేసి, బట్టల్ని బయటే విడచి డెటాల్ కలిపిన నీళ్ళలో ఉంచి వేడి నీళ్ల స్నానం చేసి మాత్రమే ఇంట్లోకి వెళితే మంచిది.
- బయట నుంచి ఇంటికి తెచ్చిన ప్రతి వస్తువులను తప్పనిసరిగా శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలి.
- ఒకవేళ బయటికి వెళ్ళితే ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, తరచుగా శానిటైజర్ ని చేతులకు రాసుకుని దగ్గర పెట్టుకోండి.
- బయటకు వెళ్లినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ముక్కును, నోటిని, కళ్లను చేతులతో తాకరాదు.
- ఆహారం వేడిగా ఉన్నపుడే తినాలి.
- రోగనిరోధక శక్తి ని పెంచే సీ విటమిన్ ఎక్కువుగా ఉండే నిమ్మ, జామ, ఉసిరితో పాటు ఆపిల్స్, బొప్పాయి, నారింజలు తరచుగా తినాలి.
- రోజు రాత్రి సమయం లో నీళ్లలో బిటడిన్ ద్రావణం కలిపి నోట్లో పోసుకుని గొంతులోకి వెళ్ళే లాగా పుక్కిలించి గార్గిల్ చేయాలి.
- ప్రతి రోజు కనీసం 6 -8 గంటలు నిద్ర ద్వారా విశ్రాంతి తీసుకోవాలి.
- ప్రస్తుత పరిస్థితుల్లో మద్యపానం జోలికి వెళ్ళక పోవడం ఆరోగ్యానికి శ్రేయస్కరం.
- కరోనా బారిన పడ్డారని తెలుసుకోవాలంటే..
A. గొంతు దురద
B. పొడి గొంతు
C. పొడి దగ్గు
D. అధిక ఉష్ణోగ్రత
E. శ్వాస ఆడకపోవడం
F. వాసన కోల్పోవడం లక్షణాలు ఎక్కువైనా శ్వాసలో ఇబ్బందులు తలెత్తినా తక్షణమే వైద్యుల సహాయం తీసుకోవాలి.
జాగ్రత్తగా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండండి.. లేకుంటే ఐసీయూలో ఐసోలేషన్ ఉండాల్సి ఉంటుందని హెచ్చరించారు.