ఫారం -7 వివాదం.. ఈసీకి ఏపీ మంత్రుల ఫిర్యాదు…

ఫారం-7 ద్వారా ఓట్లను తొలగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రుల ఆరోపణ. ఒక్కో నియోజకవర్గంలో వేల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని.. చర్యలు తీసుకోవాని ఫిర్యాదు.

1.ఈసీని కలిసిన మంత్రులు ఫరూఖ్, అమర్నాథ్ రెడ్డి, సుజయ.
2.ఫారం-7తో ఓట్లు అక్రమంగా తొలగిస్తున్నారని ఫిర్యాదు.
3.ఒక్కో నియోజకవర్గంలో వేల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణ.

ఏపీలో వివాదంగా మారిన ఫారం-7 వ్యవహారంపై ఏపీ మంత్రులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేదిని కలిసి..

ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఒక పార్టీకి చెందిన సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని.. ఓట్లను అక్రమంగా తొలగించేందుకు ఫారం -7ను వినియోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫారం-7 ద్వారా ఓట్లను తొలగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రులు ఆరోపించారు. టీఆర్ఎస్‌తో కుమ్మక్కై ఈ పనులు చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణలో కూడా ఇలాగే ఓట్లను తొలగించారని.. ఏపీలోనూ అదే తరహాలో అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

ఒక్కో నియోజకవర్గంలో వేల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఈ కుట్రలో మోదీ భాగస్వామం ఉందని ఆరోపించారు. తప్పుచేసిన వారిని ఆయా జిల్లాల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఫారం-7పై అనమానాలొద్దన్న ఈసీ
ఫారం -7 దరఖాస్తులపై అనుమానాలు అవసరం లేదన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది.

బోగస్ ఓట్లు అంటూ దరఖాస్తులు వచ్చాయని.. కానీ ఓట్లను మాత్రం తొలగించలేదన్నారు. రాష్ట్రంలో 74 నియోజకవర్గాల్లో 40 వేల ఓట్లను తొలగించేందుకు అనుమతి ఇచ్చామని.. ఇప్పటి వరకు 10 వేల ఓట్లను మాత్రమే తొలగించామన్నారు.

రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్‌ల నమోదు తర్వాత ఫిర్యాదులు తగ్గాయని.. వారం రోజుల క్రితం వరకు 1.5లక్షల ఫారం -7 దరఖాస్తులువస్తే.. ఇప్పుడు రోజుకు 300 నుంచి 400 మాత్రమే వస్తున్నాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *