ఈ నెల 23న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖలో పర్యటన

Babu is worried about KCR return gift
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ నెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్ , ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశ రాజధాని న్యూఢిల్లీ లో పర్యటన చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం నెల రోజుల పాటు ఎంగేజ్ చేసుకున్న ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు బేగం పేట విమానాశ్రయం నుంచి విశాఖ బయలుదేరు తారు.
విశాఖలో శారదాపీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. స్వామి స్వరూపానం దేంద్ర స్వామిజీ ఆశీస్సులు తీసుకుంటారు. ఆశ్రమం లోనే మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం నుండి ఒడిశా రాజధాని భువనేశ్వర్ బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఆయన నివాసంలో సమావేశం అవుతారు ఆరోజు సీఎం అధికార నివాసంలో బస చేస్తారు.
24 ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ దేవాలయం సందర్శిస్తారు. అనంతరం జగన్నాథ దేవాలయాన్ని సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకొని మధ్యాహ్న భోజనం చేస్తారు అక్కడ నుండి ప్రత్యేక విమానంలో కోల్కత్తా వెళ్తారు… సాయంత్రం నాలుగు గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో సమావేశం అవుతారు. అనంతరం కాళికామాత దేవాలయాన్ని సందర్శిస్తారు అదే రోజు రాత్రి ఢిల్లీ కి వెళ్తారు.
25వ తేదీ నుండి రెండు మూడు రోజుల పాటు ఢిల్లీ లోనే ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలుస్తారు కేంద్ర ఎన్నికల కమిషనర్ తో సమావేశం అవుతారు. బీఎస్పీ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తో సమావేశం అవుతారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి *అఖిలేశ్ యాదవ్ తోనూ * సమావేశం అవుతారు. పలువురు …
కేంద్ర మంత్రులు కలుసుకొని రాష్ట్రానికి సంబంధిం