Shoaib Akhtar vs MS Dhoni…మరి అతనికి పోటీగా రేసులోకి దిగే క్రికెటర్‌ ఎవరో..?రిటైర్మెంట్ గురించి మూడేళ్ల క్రితమే..

టీమిండియాలో వేగంగా పరుగెత్తే క్రికెటర్లలో రవీంద్ర జడేజా నెం.1 స్థానంలో ఉన్నాడు. 2018లో మైదానంలో బంతి కోసం కోహ్లీతో పోటీపడి మరీ గెలిచిన జడేజా.. ఈ ఏడాది ధోనీతో రేసులో బరిలోకి దిగబోతున్నాడా..? ఒకవేళ ధోనీ ఓడిపోతే.. రిటైర్మెంట్..?

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన రిటైర్మెంట్ గురించి పక్కా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. 2019 వన్డే ప్రపంచకప్‌‌లో ఆఖరిగా భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన ధోనీ.. ఆ తర్వాత గత ఏడాది కాలంగా కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

దాంతో.. అతని కెరీర్ ఇప్పటికే ముగిసిపోయిందని కొంత మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతుండగా.. ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత టీమిండియాలోకి ధోనీ మళ్లీ రీఎంట్రీ ఇస్తాడని మరికొందరు జోస్యం చెప్తున్నారు.

మొత్తంగా.. ధోనీ రిటైర్మెంట్ గురించి గత ఏడాదికాలంగా భారత క్రికెట్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ.. అతను మాత్రం పెదవి విప్పడం లేదు.

ధోనీ తన రిటైర్మెంట్ గురించి మూడేళ్ల క్రితమే భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌తో ఓ మాట చెప్పినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ వివాహ విందుకి హాజరైన సమయంలో.. ధోనీ తనతో రిటైర్మెంట్ గురించి చర్చించినట్లు మంజ్రేకర్ వెల్లడించాడు.

2017 చివర్లో కోహ్లీ పెళ్లి జరగగా.. అప్పటికే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ.. పేలవ ఫామ్‌తో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

‘‘విరాట్ కోహ్లీ మ్యారేజ్ సందర్భంగా మహేంద్రసింగ్ ధోనీతో కాసేపు పక్కన కూర్చుని మాట్లాడే అవకాశం లభించింది.

ఆ సమయంలో రిటైర్మెంట్ గురించి మా మధ్య జరగగా.. ధోనీ ఒక్కటే మాట చెప్పాడు. టీమిండియాలో అత్యంత వేగంగా పరుగెత్తే క్రికెటర్‌ని రేసులో ఓడించినంత కాలం..

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఆడతాను. నా ఫిట్‌నెస్‌కి అదే ప్రమాణం’’ అని ధోనీ చెప్పాడని మంజ్రేకర్ వెల్లడించాడు.

టీమిండియాలో వేగంగా పరుగెత్తే ఆటగాళ్లలో రవీంద్ర జడేజా ముందు వరుసలో ఉండగా..

ఆ తర్వాత విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా టాప్-3లో కొనసాగుతున్నారు.

2017, డిసెంబరులో హార్దిక్ పాండ్యాని 100 మీటర్ల రేసులో ఓడించిన ధోనీ.. త్వరలోనే తన ఫిట్‌నెస్‌ని మరో రేస్‌తో నిరూపించుకుంటాడేమో చూడాలి.

మరి అతనికి పోటీగా రేసులోకి దిగే క్రికెటర్‌ ఎవరో..? త్వరలోనే తేలిపోనుంది. బహుశా ఈసారి రవీంద్ర జడేజాతో ధోనీ పోటీపడొచ్చు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఈ ఇద్దరూ కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే.

ఎక్కువ ఎత్తులో బ్యాట్స్‌మెన్ శరీరంపైకి దూసుకొచ్చే బీమర్ చాలా ప్రమాదకరమైన బంతి.

సాధారణంగా ఫాస్ట్ బౌలర్ చేయి జారినప్పుడు బీమర్ పడుతుంటుంది. కానీ.. కొన్నిసార్లు బ్యాట్స్‌మెన్‌పై కోపంతో ఫాస్ట్ బౌలర్లు బీమర్‌ని సంధిస్తుంటారు.

  • Shoaib Akhtar, MS Dhoni

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని గాయపర్చాలనే దురుద్దేశంతో 2006 పైసలాబాద్ టెస్టులో తాను బీమర్‌ని సంధించినట్లు పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తాజాగా అంగీకరించాడు.

భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు, ఆటగాళ్ల మధ్య అనుబంధం గురించి సుదీర్ఘంగా మాట్లాడిన అక్తర్.. ధోనీని ఇబ్బంది పెట్టేందుకు ఆ టెస్టు మ్యాచ్‌లో తాను బీమర్‌ని ఆశ్రయించినట్లు వెల్లడించాడు.

ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లని ఉతికారేసిన మహేంద్రసింగ్ ధోనీ (148: 153 బంతుల్లో 19×4, 4×6) మెరుపు శతకం బాదేశాడు. అయితే.. ఆఖరికి ఈ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఆ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ వేసిన ఓ ఓవర్‌లో ధోనీ మూడు ఫోర్లు బాదేశాడు. దాంతో.. సహనం కోల్పోయిన అక్తర్.. ప్రమాదకరరీతిలో బీమర్‌ని సంధించాడు.

కానీ.. అది ధోనీకి దూరంగా వైడ్ రూపంలో వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ బంతి గురించి ఇంటర్వ్యూలో అక్తర్ మాట్లాడుతూ ‘‘పైసలాబాద్ టెస్టులో 8-9 ఓవర్ల స్పెల్ వేశాను.

ఆ మ్యాచ్‌లో సెంచరీ బాదిన ధోనీ.. నా బౌలింగ్‌లో దూకుడుగా ఆడాడు. దాంతో.. ఉద్దేశపూర్వకంగానే అతడ్ని ఇబ్బందిపెట్టేందుకు బీమర్‌ని సంధించా. కానీ.. ఆ తర్వాత అతనికి క్షమాపణ చెప్పా.

నా జీవితంలో ఉద్దేశపూర్వకంగా బీమర్ వేయడమనేది అదే ఫస్ట్ టైమ్. వరుసగా బౌండరీలతో సహనం కోల్పోయి..

క్షణికావేశంలో ఆ బంతిని వేయాల్సి వచ్చింది. దానిపై ఇప్పటికీ చింతిస్తున్నా’’ అని అక్తర్ వెల్లడించాడు.

పాకిస్థాన్ పర్యటనకి 2005- 2006లో వెళ్లిన భారత్ జట్టు మూడు టెస్టుల సిరీస్ ఆడగా.. ధోనీ 59.66 సగటుతో 179 పరుగులు చేశాడు. ముఖ్యంగా..

పైసలాబాద్ టెస్టులో ధోనీని నిలువరించడానికి అప్పటి పాకిస్థాన్ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ చేయని ప్రయత్నం లేదు.

ఆఖరికి స్పిన్నర్ డానిష్ కనేరియా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి.. బంతి అందకపోవడంతో ధోనీ స్టంపౌటయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *