ఐపీఎల్ 2020…ఊరిస్తూ ఉసూరమనిస్తున్న ఐపీఎల్ సీజన్పై ఈరోజే క్లారిటీ..!

మార్చి నుంచి ఊరిస్తూ ఉసూరమనిస్తున్న ఐపీఎల్ సీజన్పై ఈరోజు పూర్తి స్థాయిలో అధికారికంగా క్లారిటీరానుంది.
సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమవడం ఖాయమవగా.. ఫైనల్ తేదీపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దాంతో..
ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్పై ఆదివారం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధ్యక్షతన ఈరోజు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరగనుండగా..
టోర్నీ షెడ్యూల్, క్రికెటర్ల ప్రయాణం, క్వారంటైన్, స్టేడియాల్లోకి ప్రేక్షకుల ఎంట్రీ తదితర అంశాల గురించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఈ మీటింగ్కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా, ట్రెజరర్ అరుణ్ ధుమాల్ కూడా హాజరుకానున్నారు. దాంతో.. ఈ మీటింగ్ ముగిసిన వెంటనే ఐపీఎల్ 2020 సీజన్ గురించి పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరుకోవడంతో యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ని నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన బీసీసీఐ.. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 వరకూ మొత్తం 51 రోజుల విండో 60 మ్యాచ్ల్ని నిర్వహించాలని షెడ్యూల్ ప్లాన్ చేసింది. కానీ..
దీపావళి సీజన్ని వాడుకోవాలని బ్రాడ్కాస్టర్, ఫ్రాంఛైజీలు సూచించడంతో.. ఫైనల్ని నవంబరు 10కి మార్చబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో.. ఈరోజు గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో ఆ ఫైనల్ తేదీపై పూర్తి స్థాయిలో క్లారిటీరానుంది.
కరోనా నేపథ్యంలో.. అన్ని దేశాలు క్వారంటైన్ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తుండటంతో.. యూఏఈకి నెల రోజుల ముందే ఆటగాళ్లు చేరుకోనున్నారు.
పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ జరగనుండగా.. ఆ బయో సెక్యూర్ బబుల్ రూల్స్పై విధివిధానాల్ని రూపొందించి.. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలకి వాటిని గవర్నింగ్ కౌన్సిల్ అందించే అవకాశం ఉంది.
అలానే స్టేడియాల్లోకి ప్రేక్షకుల్ని అనుమతించాలని యూఏఈ క్రికెట్ బోర్డు భావిస్తుండగా.. గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తంగా..
ఈ మీటింగ్ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్ సాఫీగా జరగాలంటే.. పాటించాల్సిన నియమ నిబంధనల్ని క్రికెటర్లతో పాటు ఫ్రాంఛైజీలకి సవివరంగా గవర్నింగ్ కౌన్సిల్ తెలియజేసే అవకాశం ఉంది.