మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు నేడు..‘మాసు మరణం’ సాంగ్తో ట్రిబ్యూట్ అనిరుధ్!

మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఒక స్పెషల్ వీడియోతో శుభాకాంక్షలు తెలిపారు. తాను స్వరపరిచిన ‘మాసు మరణం’ సాంగ్తో ట్రిబ్యూట్ ఇచ్చారు.
భారత క్రికెట్ చరిత్రలో ది బెస్ట్ కెప్టెన్ ఎవరు అని ప్రస్తుత తరాన్ని అడిగితే టక్కున ఎం.ఎస్.ధోనీ అని చెబుతారు. నిజానికి గ్రేటెస్ట్ ఇండియన్ కెప్టెన్స్ జాబితాలో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ ముందు వరుసలో ఉంటారు.
కానీ, కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ ఇంపాక్ట్ భారత క్రికెట్ అభిమానుల్లో బాగా పాతుకుపోయింది. గత దిగ్గజాలను మరిపించింది.
‘ది బెస్ట్’ అనే పదం ఆయన వెనకే వెళ్లింది. ధోనీ బ్యాట్ పట్టి చాలా రోజులే అయినా క్రికెట్ ప్రేమికుల్లో ఆయనపై అభిమానం మాత్రం తగ్గలేదు.
అందుకే, ఈరోజు (జూలై 7) ధోనీ పుట్టినరోజు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు, మాజీ క్రికెటర్లు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే, ధోనీ బర్త్డే తమిళ క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ తమిళ ప్రజలకు బాగా దగ్గరైపోయారు.
తమిళ అభిమానులు ‘తల’, ‘తలైవా’ అని ధోనీని పిలుచుకుంటున్నారంటే ఆయన ఇంపాక్ట్ అక్కడ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సినిమా తారలకు సమానంగా అక్కడ ధోనీకి క్రేజ్ ఉంది. రాంచీ తరవాత చెన్నై ధోనీకి హోం టౌన్ అయిపోయింది. అందుకే, ఇప్పుడు ధోనీ బర్త్డేను తమిళ అభిమానులు పండగలా జరుపుకుంటున్నారు.
కేవలం సామాన్య ప్రజలే కాదు.. తమిళ సెలబ్రిటీలు సైతం ధోనీకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ ట్వీట్లో ఆయన ఒక వీడియోను పొందుపరిచారు.
‘పేట’లోని మరణం మాసు మరణం పాటను ధోనీకి అనుకూలంగా మిక్స్ చేసి అదిరిపోయే వీడియోను వదిలారు అనిరుధ్.
రజినీకాంత్ సినిమాలకు వచ్చే ఇంట్రడక్షన్ మ్యూజిక్తో మొదలైన ఈ వీడియో మంచి ఊపునిస్తోంది. ‘‘ప్రియమైన 7కి (ధోనీ జెర్సీ నంబర్) పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వొక ఎమోషన్’’ అని ఆ ట్వీట్లో అనిరుధ్ పేర్కొన్నారు.