వైసిపి ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో సమర శంఖారావం
వైసిపి ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో సమర శంఖారావంసమావేశాలు ఉంటాయని ఆ పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో సమర శంఖారావం పేరుతో పార్టీ సమావేశాలు ఉంటాయని పేర్కొన్నారు.
తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 4,5,6 తారీకులలో పార్టీ సమావేశాలు ఉంటాయని. 4 తారీకున తిరుపతి లో,5 తారీకున కడప లో,6 వ తారీఖున అనంతపురంలో పార్టీ సమావేశాలు ఉంటాయని.
తెలియజేశారు. పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా అహర్నిశలు కష్టపడి పార్టీ విజయానికి దోహదం చేయాలని కోరుకుంటూ తప్పక రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించాలని. తెలుగు ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు ను తప్పక గద్దె దించాలని పేర్కొన్నారు.
నవరత్నాలను కాపీ కొట్టి సాధ్యం కాని అనేక సంక్షేమ పథకాలతొ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. సమర శంఖారావం తో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. రాష్ట్ర ప్రజల అభ్యున్నతే వైయస్ జగన్ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన భావించారు.