తమిళనాడు సీఎంకు తప్పిన పెనుప్రమాదం….
శుక్రవారం కన్యాకుమారిలో ప్రధానమంత్రి మోదీ పర్యటించనున్న నేపథ్యంలో తమిళనాడు సీఎం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పళనిస్వామి ప్రత్యేక విమానంలో బయలుదేరారు.
తమిళనాడు సీఎం పళనిస్వామికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి శుక్రవారం త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.
విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీంతో పళనిస్వామికి పెనుప్రమాదం తప్పింది. అనంతరం ఆయన మరో విమానంలో మధురై విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి కన్యాకుమారి వెళ్లారు. ఈ విషయం తెలియగానే అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. విమానం టేకాఫ్ కాగానే సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ వెంటనే తమను సంప్రదించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.