ఏపీ గవర్నర్ గా కిరణ్ బెడీ

మొన్నటికి మొన్న మోడీ మాట్లాడుతూ ఏపీ కి స్పెషల్ స్టేటస్ కాదు… స్పెషల్ ట్రీట్మెంట్కు సంబంధించిన పనులు ఆల్రెడీ మోడీ అండ్ టీమ్ మొదలుపెట్టినట్లే కన్పిస్తోంది. రీసెంట్ గా ఏపీ ఎన్నికల అధికారిగా ద్వివేదిని నియమించింది.

ఇప్పుడు రాష్ట్రానికి కొత్త గవర్నర్ని నియమించేందుకు పావులు కదుపుతుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్ట్ మెంట్ గవర్నర్గా ఉన్న కిరణ్ బేడీని ఏపీ గవర్నర్ గా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పడి నాలుగున్నర ఏళ్లు గడిచాయి.

విభజన జరిగిన దాదాపు నాలుగున్నర ఏళ్ల తరువాత ఏపీ కి కొత్త గవర్నర్ నియమించాలని అనుకుంటుందట కేంద్రం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీకాలం చాలా కాలం క్రితమే ముగిసినప్పటికీ తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఆయనే రెండు రాష్ట్రాలకూ గవర్నర్ గా కొనసాగుతారని కేంద్రం స్పష్టం చేసింది.

ఇప్పుడు ఏపీ లో ఎన్నికలు సమీపిస్తుండటం మారిన రాజకీయాలు సమీకరణాల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక గవర్నర్ ఉంటే బాగుంటుంది అనేది కేంద్రం ఆలోచన. ఆ కోణంలోనే ఇప్పటికే ఎన్నికల కమిషనర్ ని మార్చారని వార్తలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *