చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో మామల్లాపురంలో భేటీ అయ్యారు…

1.మామల్లాపురం బీచ్లో స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని
2.చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో మామల్లాపురంలో భేటీ అయ్యారు. 3.శనివారం కూడా ఇక్కడే ఇరువురూ మరోసారి భేటీ అయి పలు అంశాలపై చర్చిస్తారు.
భారత్లో రెండు రోజుల పర్యటనకు శుక్రవారం విచ్చేసిన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్కు ప్రధాని నరేంద్ర మోదీ గైడ్గా వ్యవహరించారు.
ఇందుకు తమిళనాడులోని చారిత్రక నగరం మామల్లాపురం వేదికయ్యింది. ఇరువురు నేతలూ దాదాపు రెండున్నర గంటలపాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
రెండో రోజు కూడా ఇక్కడే సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో మహాబలిపురం బీచ్లో ప్రధాని స్వచ్ఛ భారత్ నిర్వహించడం విశేషం.
పరిసరాల పరిశుభ్రతే ప్రజల ఆరోగ్యానికి రక్ష అనే నినాదంతో మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత ‘స్వచ్ఛభారత్’కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా తానే స్వయంగా స్వచ్ఛభారత్ చేపట్టి మరోసారి అందరికీ ఆదర్శంగా నిలిచారు మోదీ. శనివారం ఉదయం మహాబలిపురం బీచ్కు వెళ్లిన ప్రధాని.. అక్కడి పరిసరాల్లోని చెత్తను స్వయంగా తొలగించారు.
శనివారం తెల్లవారుజామున మామల్లాపురం సముద్రతీరానికి వెళ్లిన మోదీ దాదాపు అరగంట పాటు మోదీ బీచ్ను శుభ్రం చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘మామల్లాపురం బీచ్కు జాగింగ్ వెళ్లిన సమయంలో అక్కడ చెత్తను తొలగించాను. సేకరించిన చెత్తను తాను బసచేసిన హోటల్లోని సిబ్బంది జయరాజ్కు అప్పగించాను.. బహిరంగ ప్రదేశాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచుదాం. మనమంతా ఫిట్గా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం’ అంటూ మోదీ ట్వీట్టర్లో పేర్కొన్నారు.