ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి అమర జవాన్లకి అంకితమిస్తాం’ అని షమీ వెల్లడించాడు.

అమర జవాన్ల కోసం ఆసీస్‌పై గెలుస్తాం.పుల్వామా దాడి వార్త నన్ను బాధించింది. సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకి తెగించి పహారా కాస్తుండటంతోనే.. మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నాం.

ఇప్పుడు 40 మంది జవాన్ల కుటుంబాలు తమ పెద్ద దిక్కుని కోల్పోయాయి. -మహ్మద్ షమీ

ఆస్ట్రేలియాతో ఈనెల 24 నుంచి రెండు టీ20, ఐదు వన్డేల సిరీస్ మొదలు పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకి రూ.5 లక్షలు సాయం ప్రకటించిన షమీ. సిరీస్ గెలిచి జవాన్లకి అంకితమిస్తామని ప్రకటన ఆ కుటుంబాలకి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని వ్యాఖ్య.

పుల్వామా దాడిలో అసువులు బాసిన అమర జవాన్ల కోసం ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి వారికి అంకితమిస్తామని భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ధీమా వ్యక్తం చేశాడు.

భారత్ వేదికగా ఆదివారం నుంచి ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ను టీమిండియా ఆడనుంది. ఈ నేపథ్యంలో.. ఈరోజు మీడియాతో మాట్లాడిన మహ్మద్ షమీ.. పుల్వామా దాడి గురించి స్పందించాడు. ఈ సందర్భంగా అమర జవాన్ల కుటుంబాలకి షమీ రూ.5 లక్షలు విరాళం ప్రకటించాడు.

‘పుల్వామా దాడి వార్త నన్ను బాధించింది. సరిహద్దుల్లో సైనికులు తమ ప్రాణాలకి తెగించి పహారా కాస్తుండటంతోనే.. మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నాం. ఇప్పుడు 40 మంది జవాన్ల కుటుంబాలు తమ పెద్ద దిక్కుని కోల్పోయాయి. కనీసం వారికి ఆర్థిక సాయం చేయడం ద్వారా అండగా నిలుద్దాం.

మన కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఆ మాత్రం మద్దతుగా నిలవడం మన బాధ్యత. ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచి అమర జవాన్లకి అంకితమిస్తాం’ అని షమీ వెల్లడించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *