జగన్‌తో మంచు విష్ణు భేటీ.. ‘అసెంబ్లీ రౌడీ’ సీటు కోసమేనా?

రాజకీయ వ్యూహాలతో బిజీగా గడుపుతున్న ప్రతి పక్షనేత వైఎస్ జగన్‌ని మంచు విష్ణు, ఆయన సతీమణి విరోనికా లోటస్ పాండ్‌లో గురువారం ఉదయం కలుసుకున్నారు. జగన్‌తో మంచు విష్ణు భేటీ హాట్ టాపిక్‌గా మారింది.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలోకి వరుస చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చేరికలకు సినీ గ్లామర్ తోడుకావడంతో సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా అవుతోంది.

ఈరోజు ఉదయం ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోగా.. మంచు హీరో మంచు విష్ణు జగన్‌ని లోటస్‌పాండ్‌లో కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

రాజకీయ వ్యూహాలతో బిజీగా గడుపుతున్న ప్రతి పక్షనేత వైఎస్ జగన్‌ని మంచు విష్ణు, ఆయన సతీమణి విరోనికా లోటస్ పాండ్‌లో గురువారం ఉదయం కలుసుకున్నారు.

జగన్ నివాసంలో మంచు విష్ణు దంపతులు కాసేపు ఆయనతో ముచ్చటించారు. అయితే జగన్‌కి మంచు విష్ణు భార్య విరోనికా బంధువు కావడంతో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఇటీవల వైసీపీ అధినేత జగన్ గుంటూరు సమీపంలోని తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటిలో నిన్న గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.

ఈ గృహ ప్రవేశానికి హాజరుకాలేకపోయిన విష్ణుదంపతులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు అందించారు. ‘అందమైన ఇంటిలో జగన్ అన్నకు అంతా మంచే జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా.

మీ కలలను సాకారం చేసుకునే దిశగా ఆ దేవుడు మీకు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

తాజాగా హైదరాబాద్‌ వచ్చిన జగన్‌ని లోటస్‌పాంట్‌లో కలుసుకుని కుటుంబ విషయాలను చర్చించుకున్నారు.

ఇదిలాఉంటే.. జగన్‌తో మంచు విష్ణు భేటీ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మోహన్ బాబు రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానంటూ ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ రౌడీ మోహన్ బాబు సీటు విషయంపై విష్ణు-జగన్‌ల మధ్య చర్చసాగిందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

జగన్, మంచు విష్ణుల భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఉందనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *