రాజ్యసభలో గట్టి సంఖ్యా బలం ఉన్న విపక్షాలు సాధించింది ఏంటి?
రాజ్యసభలో గట్టి సంఖ్యా బలం ఉన్న విపక్షాలు ఈ బడ్జెట్ సమావేశాల్లో నిర్దిష్టంగా ఏం ప్రయోజనాలను సాధించగలిగాయన్న విషయాన్ని సంబంధిత ఎంపీలను ప్రశ్నించి తెలుసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం యువత ను కొరారు.
నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ పురస్కారాలను ఆయన అందజేశారు.
అంతకుముందు మోడీ మాట్లాడుతూ పూర్తి బలం ఉన్నప్పటికీ తమ తమ ప్రాంతాల అభివృద్ధికి ప్రయోజనాల సాధనకు విపక్షాలు చేసిన కృషి అంటూ ఏది కనిపించలేదన్నారు.
అదే లోక్సభలో సంపూర్ణ మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఏకంగా 205 బిల్లుల ను ఆమోదించిన విషయాన్ని గమనించాలన్నారు.
ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలను అదేపనిగా అడ్డుకునేందుకు రాజ్యసభలో విపక్ష సభ్యులు అదే పనిగా యత్నించారని మోడీ విమర్శించారు.
అందుకే యువత తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాక రకరకాల కార్యక్రమాలను ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా సంబంధిత రాజ్యసభ సభ్యులను ఆహ్వానించాల్సిందే కోరారు.
రాజ్యసభలో పూర్తి సంఖ్యా బలం ఉన్నప్పటికీ తమ తమ నియోజకవర్గాలకు సాధించిన ప్రయోజనాలు ఏమిటో చెప్పాల్సిందిగా వారిని ప్రశ్నించాలన్నారు.