గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ జెండా ఎగరాలి:కేటీఆర్

ప్రధాని ఎవరో నిర్ణయించేది టీఆర్ఎస్: కేటీఆర్

కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి గులాములు.. ఏ పని చేయాలన్నా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అనుమతి కావాల్సిందే.

ఢిల్లీ గులామ్‌లు ఏం రాష్ట్రానికి న్యాయం చేస్తారో ప్రజలు ఆలోచించుకోవాలి.

కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నాం.
ప్రధాని ఎవరో నిర్ణయించేంది టీఆర్ఎస్.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ జెండా ఎగరాలి.

తెలంగాణకు న్యాయం చేసే గులాబీలు కావాలో? ఢిల్లీకి గులామ్‌లు కావాలో తేల్చుకోవాలంటున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

కాంగ్రెస్, బీజేపీలతో దేశానికి, రాష్ట్రానికి ఒరిగేది ఏమీలేదని.. సార్వత్రిక ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా మారబోతోందన్నారు.

కేటీఆర్ బుధవారం కరీంనగర్‌ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. కాంగ్రెస్‌, బీజేపీ టార్గెట్‌గా మండిపడ్డారు.

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్.

ఢిల్లీ గద్దె మీద టీఆర్ఎస్ కీలకం కాబోతోందని.. ఎవరు ప్రధాని కావాలో నిర్ణయించే శక్తి కేసీఆర్‌కు ఉంటుందన్నారు.

ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైనా వేసే ఓటు కేసీఆర్‌కే అన్నారు కేటీఆర్. ‘గల్లీ నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ జెండా ఎగరాలి.. ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ పరిపాలన చూశాం..

నాలుగేళ్లలో కేసీఆర్ పరిపాలన చూశాం.. రెండింటినీ బేరీజు వేసుకుని ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.

కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలించిందని.. తెలంగాణ పథకాలను కేంద్రమంత్రులు సైతం కొనియాడరాని గుర్తు చేశారు.

దేశంలో బలమైన శక్తిగా ఉంటేనే నిధులు వస్తాయన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.

బలమైన ప్రభుత్వాలు ఉంటేనే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు.

కాంగ్రెస్, బీజేపీలు దొందు దొందే
ప్ధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దొందు దొందేనన్నారు కేటీఆర్.

ఒకరు రాఫెల్ అంటే.. మరొకరు బోఫోర్స్ అంటారని ఎద్దేవా చేశారు.

ఈ ఇద్దరు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ‘2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి 11 మంది

ఎంపీలను గెలిపించి లోక్‌సభకు పంపించాం.. ఆ ఎన్నికల్లో మోదీ అంటే ఓ భ్రమ.. దేశాన్ని ఉద్దరిస్తారని బీజేపీకి 283 సీట్లను కట్టబెట్టారు.

అప్పుడు ఎవరి అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏన్డీయే ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేయలేదు’అన్నారు కేటీఆర్.

వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు 150 సీట్లే
త్వరలోనే జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 150 సీట్లు రావడం కష్టమేనంటున్నారు కేటీఆర్.

కాంగ్రెస్‌కు 100 నుంచి 110 సీట్లు రావని జోస్యం చెప్పారు.

కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ 16 మంది ఎంపీలకు మరికొంత మంది తోడవుతారని.. భావసారూప్యత కలిగిన పార్టీలన్ని కలిసి 70 స్థానాలకు తగ్గకుండా.

100 పైచిలుకు స్థానాలను కైవసం చేసుకోబోతున్నాయన్నారు. 100 స్థానాలతో కొత్త కూటమి ఏర్పడే అవకాశం ఉందన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కేసీఆర్‌కు మద్దతుగా నిలిచి.. ఢిల్లీలో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలకంగా మారతుందన్నారు.

ఢిల్లీకి గులాములు కావాలా.. తెలంగాణకు న్యాయం చేసే గులాబీలు కావాలా
ఉద్యమం సమయంలో కాంగ్రెస్ ఎంపీలు చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి గులాములు..

ఏ పని చేయాలన్నా పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అనుమతి కావాల్సిందేనని ఎద్దేవా చేశారు.

టికెట్ నుంచి బీ ఫామ్‌ వరకు ఏదైనా ఢిల్లీకి వెళ్లాల్సిందేనని.. ఢిల్లీ గులామ్‌లు ఏం రాష్ట్రానికి న్యాయం చేస్తారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.

కరీంనగర్‌కు రైల్వే ప్రాజెక్టులు రావాలంటే ఎంపీ వినోద్‌ను మరోసారి ఎంపీగా గెలిపించాలన్నారు.

పొరపాటున కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు.

కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి 5 లక్షల ఓట్ల మెజార్టీతో వినోద్ కుమార్‌ను గెలిపించాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *