తుస్సుమన్న పాక్ బాంబ్.. డ్రోన్ ప్రయోగమూ విఫలం

భారత వైమానిక దళాలు పాక్ భూభాగంలో ప్రవేశించి ఉగ్ర స్థావరాలను మట్టికరిపించాయి. మన మిరాజ్ 2000 యుద్ధ విమానాలను అడ్డుకోవడానికి పాక్ దళాలు ప్రయత్నించాయి…

పుల్వామా ఉగ్రదాడికి భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. వైమానిక ద‌ళానికి చెందిన మిరాజ్ యుద్ధ విమానాలు గర్జించాయి.

సర్జికల్ స్ట్రైక్స్ 2.0గా అభివర్ణిస్తున్న ఈ దాడులతో భారత సైన్యం పాక్ వెన్నులో వణుకు పుట్టించింది.

జైషే ఉగ్రవాద స్థావ‌రాల‌ను మట్టికరిపించింది. ఈ దాడిలో 300లకు పైగా ముష్కరులు మరణించినట్లు తెలుస్తోంది.

అయితే.. ఈ విషయాన్ని పైకి చెప్పుకోలేని దుర్భర స్థితిలో దాయాది దేశం ఉంది.

మరి దాడి జ‌రుగుతున్న స‌మ‌యంలో పాకిస్థాన్‌కు చెందిన దళాలు అడ్డుకునే ప్రయత్నం చేయలేదా అనేది అందరికీ వచ్చే సందేహం.. అడ్డుకునే ప్రయత్నం చేశాయి.. కానీ, మన మిరాజ్ 2000 యుద్ధ విమానాల గర్జన చూసి తోకముడిచాయి.

పాక్ దళాలు ఓ మోర్టార్ షెల్‌తో ప్రతిదాడికి ప్రయత్నించాయి.. కానీ, అది తుస్సుమంటూ వారి భూభాగంపైనే పడిపోయింది.

ఈ విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పాక్‌పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

మిరాజ్ యుద్ధ విమానాలను అడ్డుకునేందుకు పాక్ ఎఫ్‌16 యుద్ధ విమానాలు ప్రయత్నించాయి.

కానీ, వ్యూహాత్మకంగా పాక్ భూభాగాన్ని చుట్టేసిన 12 మిరాజ్ యుద్ధ విమానాలను చూసి అవి తోకముడిచాయి. మిరాజ్ ఫ్లీట్‌ను గమనించి ఎఫ్‌16 విమానాలు వెన‌క్కి వెళ్లిపోయాయి.

భారత వైమానికి దళం.. పాక్ భూభాగంలోకి ప్రవేశించి దాడులు జరపడంతో దాయాది దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. నేరుగా దాడికి దిగే సాహసం చేయలేక సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

భారత వాయుసేన దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే పాక్‌కు చెందిన ఓ డ్రోన్‌ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. వెంటనే గుర్తించిన భారత బలగాలు దాన్ని పేల్చివేశారు.

గుజరాత్‌లోని కచ్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న నలియా ఎయిర్‌ బేస్‌ సమీపంలో మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పాక్ భూభాగం నుంచి వచ్చిన డ్రోన్‌ను గుర్తించారు.

అక్కడి సిబ్బంది దాన్ని వెంటనే పేల్చివేశారు. ఈ ఎయిర్‌ బేస్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంటుంది.

సర్జికల్ దాడుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌లో హైఅలర్ట్‌ ప్రకటించగా గుజరాత్‌లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాయుసేన హెచ్చరికలు జారీ చేసింది.

ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా.. వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *