దేశవ్యాప్తంగా 11వేల కొవిడ్ సహాయ శిబిరాలు ఉన్నాయి:మోదీ

కరోనా పరీక్షలు నిర్వహించేందుకు మూడు నగరాల్లో ఐసీఎంఆర్​ ఏర్పాటు చేసిన టెస్టింగ్ కేంద్రాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ.

దేశవ్యాప్తంగా దాదాపు 1300 టెస్టింగ్​ కేంద్రాలు ఉన్నాయని, రోజుకు 5లక్షలకుపైగా నమూనాలు పరీక్షిస్తున్నట్లు చెప్పారు.

కోల్​కతా, నోయిడా, ముంబయిలో ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన మూడు కొవిడ్ టెస్టింగ్ కేంద్రాలను దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ.

భవిష్యత్తులో ఈ కేంద్రాలను హెపటైటిస్​ బీ, సీ, హెచ్​ఐవీ, డెంగీ వంటి పరీక్షలు నిర్వహించేలా విస్తరిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 11వేల కొవిడ్ సహాయ శిబిరాలు ఉన్నట్లు మోదీ చెప్పారు. ఇప్పటి వరకు 1300 కరోనా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, రోజుకు 5లక్షల మందికిపైగా నమూనాలను పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *