వైఎస్సార్సీపీలోకి వలసలకు తాత్కాలిక బ్రేక్.. తిరిగి వచ్చిన వెంటనే జగన్ అభ్యర్థుల ప్రకటన

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వానికి వారంరోజుల విరామం పడినట్టే. నిన్న రాత్రి లండన్ బయల్దేరి వెళ్లారు వైఎస్ జగన్.

సతీసమేతంగా ఆయన అక్కడున్న కూతురును చూడటానికి వెళ్లారు.

వారంరోజుల పాటు జగన్ పర్యటన సాగుతుందని తెలుస్తోంది. ఈనెల ఇరవై ఆరో తేదీన జగన్ తిరిగి రానున్నారని సమాచారం.

గత వారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు సాగాయి. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ  నుంచి నేతలు తరలివచ్చారు.

ఆ పై నిన్న కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి వచ్చిచేరారు. నిన్న జగన్ తో నాగార్జున సమావేశం కూడా ఆసక్తిని రేపింది.

ఈ నేపథ్యంలో తదుపది వారం రోజులూ జగన్ చేరాలనుకునే నేతలకు అందుబాటులో లేనట్టే.

జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మరింత మంది నేతలు వైఎస్సార్సీపీలోకి చేరడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

తిరిగి వచ్చిన వెంటనే జగన్ అభ్యర్థుల ప్రకటన అంశం మీద కూడా దృష్టి పెట్టనున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *