రామగుండంలో దారుణం: ప్రేమించడం లేదని కత్తితో పొడిచాడు

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించడం లేదని ఓ వివాహితపై కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో దారుణం చోటుచేసుకుంది.

ప్రేమించడం లేదని యువతిని యువకుడు కత్తితో పొడిచాడు.

ప్రేమోన్మాదులకు అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధించడం, ఒప్పుకోకపోతే ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడకపోవడం వంటి ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి.

తనను ప్రేమించడం లేదని హైదరాబాద్‌లోని బర్కత్‌పురాలో ఇంటర్ విద్యార్థిని మధులికపై భరత్ అనే యువకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మరువక ముందే పెద్దపల్లి జిల్లాలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.

తనను ప్రేమించడం లేదంటూ ఓ యువతిని కత్తితో పొడిచాడు. ఈ ఘటన రామగుండంలో కలకలం రేపింది.

ఎన్టీపీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని జ్యోతినగర్‌ ఆటోనగర్‌లో నస్పూరి శ్రీనివాస్‌(29), చంటి స్రవంతి (25) పక్కపక్క ఇళ్లలో నివాసముంటున్నారు.

స్రవంతికి ఆరేళ్ల క్రితమే పెళ్లి కాగా.. భర్తతో విభేదాలతో కొద్దికాలంగా పుట్టింట్లోనే ఉంటోంది. దీంతో స్రవంతిపై కన్నేసిన శ్రీనివాస్ ప్రేమిస్తున్నానంటూ ఆమెను వేధిస్తున్నాడు. అయితే స్రవంతి అతడిని పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు.

గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన స్రవంతిని నడిరోడ్డుపైనే నిలదీశాడు శ్రీనివాస్. ఆమెతో వాగ్వాదానికి దిగి కడుపులో కత్తితో పొడిచి పరారయ్యాడు.

తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న స్రవంతిని స్థానికులు వెంటనే గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఏఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *