ప్రేమ నిరాకరించిందని యువతి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది
తెలంగాణ రాష్ట్రంలో మరో ఘాతుకం జరిగింది తన ప్రేమ నిరాకరించిందని వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండలోని నయీమ్ నగర్ లో కళాశాలకు వెళ్తున్న విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ప్రేమోన్మాది.
మొన్నటికి మొన్న మధులిక పై ప్రేమోన్మాది భరత్ చేసిన దాడి ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకువడo తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
హనుమకొండ నయిమ్ నగర్ లో ఉన్న వాగ్దేవి కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రవళి అనే యువతిపై అదే కళాశాలలో బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న అన్వేష్అనే యువకుడు దాడి చెసాడు.
గత కొంతకాలంగా ప్రేమించమని వెంట పడుతున్న ఆ యువకుడు, రవళి ప్రేమను నిరాకరించడంతో కక్ష పెంచుకుని కళాశాల కు వెళుతున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
అకస్మాత్తుగా జరిగిన దాడిలో రవళి షాక్ గురైంది అంతలోనే మంటలు చెలరేగడంతో రవళి దాదాపు 80% కాలిపోయింది.
కళ్ళ ఎదుటే యువతి క్షణాల్లో మంటలకు బలైపోయింది.
నయీమ్ నగర్ నడి రోడ్డు మీద జరిగిన ఈ ఘటన స్థానికంగా అందరికి షాక్ కు గురి చేసింది.
అన్వేష్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన రవళి నీ హట హుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు ,రవళికి ఎంజీఎం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళ స్వగ్రామం వరంగల్ రూరల్ జిల్లా సంఘం మండలంలోని రామచంద్ర పురం గ్రామం.
దాడి చేసిన అనంతరం అన్వేష్ అక్కడి నుండి పరారయ్యాడు.
కళాశాల సమీపంలో జరిగిన ఘటన తో కళాశాల యాజమాన్యం సైతం షాక్ కు గురయింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.