జగన్ తో భేటీల పై…. టీడీపీ లో కలవరం…

రానున్న ఎన్నికల్లో విజయం రాజన్నదే అంటూ… అటు ప్రజలు, రాజకీయ నాయకులు, సినీతారలు అందరికీ అర్థమైపోయింది. అందుకే జగన్ భేటీకి అందరూ క్యూ కడుతున్నారు.
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వరసబెట్టి వలస బాట పట్టారు …. ఇతర ప్రముఖులు కూడా జగన్ తో భేటీ అయి తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు.
దీంతో తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది.
చేజారిపోతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో పార్టీకి ఎలాంటి నష్టంలేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన మధనపడిపోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
జగన్ తో ఎవరైతే భేటీ అవుతున్నారో, వాళ్ల ప్రత్యర్థుల్లో భయం మరింత ఎక్కువ అయినట్లు సమాచారం.
ఎంపీ అవంతి శ్రీనివాస్ చేరిక సమయంలో మంత్రి గంటా శ్రీనివాస్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
తాను చేసిన రాయబేరాలు కూడా బయటపడతాయనే భయంతో అవంతిపై నోరు పారేసుకొని పరువు పోగొట్టుకున్నారు గంటా.
హీరో నాగార్జున వైఎస్ జగన్ ని కలవడం, ఆయన గుంటూరు నుంచి పోటీచేస్తారనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఎంపీ గల్లా జయదేవ్ ఉలిక్కిపడ్డారు.
గుంటూరు సీటుపై నాగ్ కర్చీఫ్ వేస్తాడేమోనన్న అనుమానంతో గల్లా ముందుగానే బైటపడ్డారు.
నాగార్జున తనకు మంచి స్నేహితుడని, జగన్ ని కలసినంత మాత్రాన ఆయన రాజకీయాల్లోకి వస్తారని తాను అనుకోవడంలేదని, తనకు చెప్పకుండా ఆయన గుంటూరు నుంచి పోటీచేయరని చెప్పుకొచ్చారు.
జగన్-నాగ్ భేటీ గురించి ఇంత సుదీర్ఘమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం గల్లాకు లేదు. అయితే తన సీటుకు ఎక్కడ పోటీ ఉంటుంది అన్న భయంతోనే ఆయన ఈ విధంగా కవరింగ్ ఇచ్చిరు…
సర్వేలో టీడీపీకి తాము దారుణంగా పరాభవం కాక తప్పదని అర్థమైంది. ఈ మేరకు నాగార్జున తనపై పోటీచేస్తే, అందులోనూ వైసీపీ టికెట్ పై.. ఇంకేమైనా ఉందా, డిపాజిట్ ఏ గల్లంతు అవుతుంది… అందుకోసమే ముందు గానే జాగ్రత్త కోసం నాగార్జున రాజకీయాల్లోకి రాడని ఓ డైలాగ్ చెప్పారు .. గల్లా జయదేవ్.
జగన్ తో ఎవరు భేటీ అవుతున్నా పచ్చనేతలు మాత్రం హడలిపోతున్నారు. తమ సీట్లు కు ఎక్కడ చిల్లు పడుతుందని వణికిపోతున్నారు.