ప్రసంగం ఆపేసిన షర్మిల.. ముస్లింలు ఫిదా!

గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షర్మిల బాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హరికృష్ణ శవం పక్కన ఉండగానే బాబు కేసీఆర్‌తో పొత్తు చర్చలు జరిపారని ఆమె ఆరోపించారు.

గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ షర్మిల చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నందమూరి హరికృష్ణ శవం పక్కన ఉండగానే బాబు కేసీఆర్‌తో పొత్తు చర్చలు జరిపారని ఆమె ఆరోపించారు.

తమ పార్టీకి ఎవరితోనూ పొత్తు లేదని చెప్పిన ఆమె.. జగన్ సింగిల్‌గానే బంపర్ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు.

పిల్లనిచ్చిన సొంత మామను బాబు వెన్నుపోటు పొడిచారని ఆమె విమర్శించారు. అల్లుడు కదా అని పార్టీలోకి రానీస్తే.. ఎన్టీఆర్ కుర్చీనే లాగేసుకున్నాడన్నారు.

జగన్ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తుందన్న ఆమె.. ఓటేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండని కోరారు. ఆయన కొడుకు జగన్ అన్నకు ఒక్కసారి అవకాశం ఇద్దామన్నారు.

ముస్లిం సోదరులు నమాజ్ చేస్తున్న విషయాన్ని గమనించిన షర్మిల తన ప్రసంగాన్ని ఆపేశారు. నమాజ్ అవుతున్నంత సేపు కదలకుండా నిలుచుండిపోయిన ఆమె… నమాజ్ ముగిసిన తర్వాత ఆమె తిరిగి తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *