Pulwama దాడి పై ఆగ్రహంగా ఉన్న భారత్-పాకిస్థాన్ కు వ్యతిరేకంగా మరో కఠిన చర్యకు సిద్ధమవుతోంది*
సింధు జల ఒప్పందం కింద దక్కిన నదీజలాల్లో ని మన వాటా నీటిని పాకిస్థాన్ కు ప్రవహించకుండా అడ్డుకోవాలని ర్ణయించింది. మన దేశం లోని తూర్పు ప్రాంతంలో ప్రవహించే నదీ జలాలను పాకిస్తాన్ కి వెళ్ళకుండా నిర్వహించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గట్కారి పేర్కొన్నారు.
ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పాకిస్తాన్లోకి ప్రవహించే మన వాటా జలాన్ని ఆపేయాలని నిర్ణయించింది. తూర్పు ప్రాంత నదుల జలాలను మళ్లించి జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ప్రజలకు అందిస్తాం.
రావి నది పై షాపూర్ ,కంది డ్యాం నిర్మాణం ప్రారంభమైందన్నారు, యూ జే హెచ్ ప్రాజెక్టులో నిర్వహించే మన వాటాజలాన్ని జమ్మూకాశ్మీర్కు ఉపయోగిస్తామన్నారు .మిగిలిన జలాలు రెండో రావి ,బియాస్ లింకు ద్వారా ఇతర రాష్ట్రాల కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు. ఇవన్నీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినట్లు వివరించారు.
యూపీ బాగ్ పట్లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ భారత్ పాకిస్థాన్లకు చెరి మూడు నదులు దక్కాయని పేర్కొన్నారు. మనకు హక్కు ఉండే జలాలు పాకిస్తాన్ కు వెళ్తున్నాం అన్నారు 3 ప్రాజెక్టులను నిర్మించి ఆ జలాన్ని యమునానదిలో కి మళ్లిస్తామని చెప్పారు.
Pulwama ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీ శ్రీనగర్ జమ్మూ శ్రీనగర్ మధ్య రాకపోకలు సాగించే కేంద్ర పారా మిలటరీ సిబ్బంది కి విమాన సౌకర్యం కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. శ్రీనగర్ ప్రాంతం నుంచి జమ్ము ఢిల్లీకి రోడ్ మార్గంలో ప్రేమించడం అంత సురక్షితం కాదని ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఢిల్లీ ,శ్రీ నగర్, శ్రీ నగర్, ఢిలి ,జమ్మూ శ్రీనగర్ ,శ్రీనగర్ ,జమ్మూ ల మధ్య పారామిలటరి సిబ్బంది విమానాలు ఉచితంగా ప్రయాణించడానికి వీలు అవుత సిబ్బంది విమానాలు ఉచితంగా ప్రయాణించడానికి వీలు అవుతుంది