పాక్పై దాడుల్ని ముందే ఊహించాను: సర్జికల్ స్ట్రైక్స్-1
నియంత్రణ రేఖను దాటి భారత్ చేసిన దాడిలో పాక్ జామర్లను నిర్వీర్వం చేయడం వాయుసేనకు బాగా కలిసొచ్చిందని మాజీ లెఫ్టినెంట్ జనరల్, సర్జికల్ స్ట్రైక్స్ 1 హీరో దీపేంద్ర సింగ్ హూడా పేర్కొన్నారు.
నియంత్రణ రేఖ దాటి పాక్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడులుమిరాజ్ 2000 యుద్ధ విమానాలతో బాంబుదాడులు.. ఉగ్రస్థావరాలు ధ్వంసంభారత్తో పెట్టుకుంటే పాక్కు మూల్యం తప్పదన్న సర్జికల్ స్ట్రైక్స్ 1 హీరో
పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్పోర్స్ జరిపిన మెరుపు దాడులపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అన్ని రంగాల ప్రముఖలు భారత వాయుసేన చర్యను, కేంద్ర ప్రభుత్వ ప్రతీకార దాడి నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు.
భారత్ జరిపిన సర్జికల్ దాడులు 2.0పై మాజీ లెఫ్టినెంట్ జనరల్.. సర్జికల్ దాడులు 1 హీరో దీపేంద్ర సింగ్ హూడాస్పందించారు.
ప్రస్తుత దాడులు కేంద్ర ప్రభుత్వం బాధ్యతతో నిర్వహించినవని పేర్కొన్నారు.
‘భారత్తో పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని పాక్కు మరోసారి తెలిసేలా చేశారు.
పాక్ ఉగ్రదాడి జరిపిన వెంటనే దాడులకు పాల్పడకుండా ఓ ప్లాన్ ప్రకారం భారత వాయుసేన దాడి చేసింది.
ఉరిలో ఆర్మీ హెడ్క్వార్టర్స్పై ఉగ్రదాడి నేపథ్యంలో తొలిసారి భారత్ సర్జికల్ దాడులు చేసింది.
పాకిస్థాన్- పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దు భూభాగంలో ఉగ్రవాదులు స్థావరాలు చాలా ఉన్నాయి.
నియంత్రణ రేఖను దాటి బాలాకోట్పై భారత్ చేసిన దాడిలో పాక్ జామర్లను నిర్వీర్వం చేయడం వాయుసేనకు బాగా కలిసొచ్చింది.
సాంకేతికంగా చూసినా పాక్ కంటే భారత వాయుసేన ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది.
పుల్వామాలో ఆత్మాహుతి దాడి అనంతరం భారత్ మరోసారి సర్జికల్ దాడులు చేస్తుందని ముందే ఊహించాను.
భారత్ చాకచక్యంగా ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. మన సైనికులు సురక్షితంగా పని ముగించుకుని తిరిగి రావడం సంతోషంగా ఉందన్నారు’ దీపేంద్ర సింగ్ హుడా.
2016లో భారత్ తొలిసారి నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో హుడా నార్త్ ఆర్మీ కమాండర్గా కీలకపాత్ర పోషించారు.
కాగా, భారత వాయుసేన ఫిబ్రవరి 26న (మంగళవారం) వేకువజామున దాదాపు మూడున్నర గంటల ప్రాంతంలో మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో జైషే మహ్మద్ ఉగ్రవాదుల స్థావరాలపై 1000 కిలోల బరువైన బాంబులను జారవిడిచి దాడులు చేసింది.
దాదాపు 300 మంది ఉగ్రహతులు హతమై ఉంటారని సమాచారం.