జనసేన అధికారంలోకి వస్తే విద్యార్ధులకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బస్ పాస్, ఫ్రీ మీల్స్ సౌకర్యాలను కల్పిస్తామన్నారు పవన్ కళ్యాణ్

Does A Party Need Rs 2,000 Cr To Fight Polls?

Does A Party Need Rs 2,000cr To Fight Polls?

చదువుపై విసుగేసి ఇంటర్‌తో ఆపేశా: విద్యార్థులతో పవన్

ప్రతిపక్షపార్టీలు కాని.. అధికార పార్టీలు కాని మేం అధికారంలోకి వస్తే.. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తాం అంటున్నారు. అసలు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయాల్సిన అవసరం ఏం ఉంది. ఫీజులు తీసుకోకుండా ఉండండి.

  • 1.చిత్తూరు జిల్లాలో విద్యార్ధులతో పవన్ కళ్యాణ్ ఇష్టాగోష్టి.
  • 2.విద్యార్ధులకు పవన్ కళ్యాణ్ వరాల జల్లు అధికారంలోకి వస్తే ఫ్రీ ఫుడ్, ఫ్రీ బస్ పాస్, ఫ్రీ ఎడ్యుకేషన్.

చదువు పేరుతో కార్పోరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల్ని నాలుగుగోడల మధ్య చావగొడుతున్నారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

చిత్తూరు జిల్లా విద్యార్ధులతో ఇష్టాగోష్టి నిర్వహించిన ఆయన విద్యావ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి దశా నిర్ధేశం చేశారు.

ఈ సందర్భంగా జనసేన అధికారంలోకి వస్తే విద్యార్ధులకు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బస్ పాస్, ఫ్రీ మీల్స్ సౌకర్యాలను కల్పిస్తామన్నారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..

ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావిధానాల్లో మార్పు రావాలి. ఈరోజు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వాళ్ల పిల్లల్ని ప్రైవేటు స్కూల్‌కి పంపిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుండదు అని.

ఆపిల్ ఇలా ఉంటుంది.. తింటే తియ్యగా ఉంటుంది అంటే విద్యార్ధులకు ఏం అర్ధమౌతుంది. ఆ విషయాన్ని వాళ్లు అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి. వాడికి నిజంగా ఆపిల్ ఇచ్చి తిని చూడమంటే రుచి తెలుసుకుంటాడు.

ఇలాంటి కాన్సెప్ట్యువల్ అండర్‌స్టాండింగ్ చెప్పే టీచింగ్ మెకనిజంని మన విద్యావ్యవస్థ చంపేసింది. జనసేన మేజర్ థింకింగ్ ఏంటంటే.. కాన్సెప్ట్యువల్ అండర్‌స్టాండింగ్ ప్రతి గవర్నమెంట్ స్కూల్‌కి తీసుకువచ్చే బాధ్యత అలాంటి టీచర్‌ని తయారు చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది.

కన్వెన్షనల్ ఫార్మేట్‌లో చదువుకోలేదు నేను. నాకు ఎగ్జామ్స్ అంటే చిరాకు. నా నాలెడ్జ్‌కి ఎగ్జామ్ ప్రాతిపతిక ఏంటి అనిపించేది.

థామస్ ఆల్వా ఎడిసన్ ఎక్కడకూ వెళ్లి చదువుకోలేదు. ఐన్‌స్టీన్ ట్రెడిషలన్ స్కూల్‌లో చదువుకోలేదు. వీళ్లెవరూ కన్వెన్షనల్ ఫార్మేట్‌లో చదువుకోలేదు.

ప్రతిపక్షపార్టీలు కాని.. అధికార పార్టీలు కాని మేం అధికారంలోకి వస్తే.. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తాం అంటున్నారు.

అసలు ఫీజు రీయింబర్స్ మెంట్ చేయాల్సిన అవసరం ఏం ఉంది. ఫీజులు తీసుకోకుండా ఉండండి. స్టూడెంట్స్‌కి భోజనాలు పెట్టండి.

కార్పోరేట్ విద్యాసంస్థలు చదువు చదువు అని విద్యార్ధుల్ని నాలుగు గదుల్లో బంధించి బలవంతంగా చదువు చెబుతున్నారు. వాళ్లని చావగొడతారు.

ఇప్పుడు కేవలం చెప్పుకోవడానికి డిగ్రీ.. చెప్పుకోవడానికి ఇంటర్.. చెప్పుకోవడానికి టెన్త్ తప్ప కాన్సెప్ట్యువల్ అండర్‌స్టాండింగ్ లేని విద్య వల్ల ఉపయోగం ఉండదు.

ఉత్తి పేపర్‌లే మిగులుతాయి. వాటికంటే బతుకు నేర్పే రెండు అక్షరం ముక్కలే నయం.

అన్నికంటే ముఖ్యంగా విద్య అనేది మల్టిపుల్ స్కిల్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ రావాలి. నేను అలాంటి వాటికోసమే చూస్తున్నా. మన రాష్ట్రంలో ఇంతమంది యువత ఉన్నారు. ఇంత మంది విద్యార్ధులు ఉన్నారు.

వీళ్ళందరికీ కావాల్సింది రైట్ ఎడ్యుకేషన్. అంతేకాని కూర్చోబెట్టి డబ్బులు ఇస్తా.. పాకెట్ మనీ ఇస్తాం అంటే కరెక్ట్ కాదు. విద్యార్ధి ఎవరైనా వాళ్లకి కావాల్సింది నాలెడ్జ్.

నేను చిన్నప్పుడు ఎవర్నీ అడిగేవాడిని కాదు.. లైబ్రరీకి వెళ్లి నాకు ఇష్టమైంది చదువుకుందాం అంటే అన్నీ లాక్ చేసి ఉండేవి.

మరి దేనికి ఆ పుస్తకాలు. కనీసం విద్యార్ధులకు ఆడుకోవడానికి మైదానాలు కూడా లేవు. విద్య అనేది వ్యాపారం కాకూడదు.. విద్య జ్ఞానం కావాలి.

నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి మీకు మరింత అండగా నిలబడగలను. నా ఎడ్యుకేషన్ ఇంటర్‌తో ఆపేశా విసుగుతో.

తరువాత ఎలక్ట్రానిక్ డిప్లమో చేయడానికి ట్రై చేశా. తరువాత కంప్యూటర్ సైన్స్ డిప్లమో చేశా. కొంత ఆటోకేడ్ నేర్చుకున్నా.. ఇలా పిచ్చి పిచ్చివి చేశా. అయితే ఎడ్యుకేషన్ అనేది ప్రణాళికతో ఉండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *