జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 23 నుండి విశాఖ పర్యటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న విశాఖ రానున్నారు. అదే రోజు విశాఖలో శ్రీకాకుళం జిల్లా నేతలతో భేటీ అవుతారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితిని సమీక్షిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పాడేరు లో బహిరంగ సభ నిర్వహిస్తారు. మాజీ మంత్రి బాలరాజు ఆధ్వర్యంలో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బహిరంగ సభ అనంతరం గిరిజన సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై గిరిజన నేతలతో చర్చలు జరుపుతారు. 24వ తేదీన విజయనగరం జిల్లా నేతలతో భేటీ అవుతారు. ప్రస్తుతానికి విశాఖలోని ఆ సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించాలని భావిస్తున్నారు. విజయనగరం వెళ్లి అక్కడే సమావేశం నిర్వహించే అంశాన్ని కూడా ఆ పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో కొందరు నేతలు కూడా విశాఖలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన లో చేరబోతున్న టు అంచనా వేస్తున్నారు.
దీంతోపాటు జనసేనలో చేరిన ఆసక్తి ఉన్న వారితో మాట్లాడించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ఉన్న నాయకులతో మాట్లాడి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై పవన్ చర్చించనున్నారు.