మద్యం మత్తులో…పానీపూరీ లేదన్నందుకు..గొడవ పడి ప్రాణాలు కోల్పోయాడు
పానీపూరీ వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది.
రాత్రిసమయంలో పానీపూరీ అడిగితే ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆవేశంలో బండిని కొట్టగా గ్లాస్ గుచ్చకుని రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయాడు.
పానీపూరీ వివాదం హైదరాబాద్లో ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. పానీపూరీ లేదన్నందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వ్యక్తి చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
పానీ పూరి బండి దగ్గర జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన హైదరాబాద్ పాతబస్తీలోకి తుక్కుగూడలో చోటుచేసుకుంది.
తుక్కుగూడకు చెందిన కట్టెల శ్రీనివాస్(28) బుధవారం రాత్రి మద్యం మత్తులో బైక్పై స్థానికంగా ఉన్న చౌరస్తాలోని పానీ పూరి బండి వద్దకు వెళ్లాడు.
పానీ పూరి ఇవ్వాలని అడగ్గా అయిపోయిందని బండి వాడు చెప్పాడు. తనకే లేదని సమాధానం చెబుతావా అంటూ శ్రీనివాస్ అతనితో ఘర్షణ పడ్డాడు.
ఎందుకు గొడవ పడుతున్నావంటూ అక్కడే ఉన్న యాదయ్య అనే వ్యక్తి శ్రీనివాస్ను వారించాడు. దీంతో మరింత కోపోద్రిక్తుడైన శ్రీనివాస్ పానీపూరి బండిపై గట్టిగా బాదాడు. దీంతో అక్కడ ఉన్న గాజు గ్లాసు పగిలి శ్రీనివాస్ కుడి చేతి నరానికి తగిలి తీవ్రగాయమైంది
గాజు ముక్కలు గాయంలో ఇరుక్కుపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. గొడవ విషయం స్థానికులు పోలీసులకు చెప్పడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని శ్రీనివాస్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే చాలా రక్తం పోవడంతో శ్రీనివాస్ మృతి చెందాడని ఉస్మానియా డాక్టర్లు తెలిపారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.