గుజరాత్‌లోకి పాక్ డ్రోన్‌.. కుప్పకూల్చిన భారత సైన్యం, సరిహద్దులో హై అలర్ట్

ప్రతీకారేచ్ఛతో పాక్.. గుజరాత్‌లోని కచ్‌లోకి డ్రోన్.. కుప్పకూల్చిన భారత దళాలు. సరిహద్దులో హై అలర్ట్. సర్వసన్నద్ధమైన భారత సైన్యం.

భారత వైమానికి దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలు పాక్ గడ్డపైకి ప్రవేశించి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో దాయాది దేశం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది.

నేరుగా దాడికి దిగే సాహసం చేయలేక సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత వాయుసేన దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే పాక్‌కు చెందిన ఓ డ్రోన్‌ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. వెంటనే గుర్తించిన భారత బలగాలు దాన్ని పేల్చివేశారు.

గుజరాత్‌లోని కచ్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న నలియా ఎయిర్‌ బేస్‌ సమీపంలో మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పాక్ భూభాగం నుంచి వచ్చిన డ్రోన్‌ను గుర్తించారు.

అక్కడి సిబ్బంది దాన్ని వెంటనే పేల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఎయిర్‌ బేస్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంటుంది.

సరిహద్దులో హై అలర్ట్..

సర్జికల్ దాడుల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించినా..

వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గుజరాత్‌లోనూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాయుసేన హెచ్చరికలు జారీ చేసింది. జమ్ము కశ్మీర్‌లోని ఎల్వోసీ వెంట సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *