విశేషం ఏమిటంటే…. ఒకటి ఆశిస్తే మరో టికెట్ దక్కడం
నెల్లూరు ఎంపీ టికెట్ ను బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, కావలి నుంచి బీద మస్తాన్ రావు, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆత్మకూరు నుంచి బొల్లినేని కృష్ణయ్యలకు తెలుగుదేశం అభ్యర్థిత్వాలు ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.
విశేషం ఏమిటంటే.. వీరిలో కొందరికి ఒకటి ఆశిస్తే మరో టికెట్ దక్కడం.
ఆత్మకూరు నుంచి పోటీ చేయాలనేది రాఘవేంద్రరెడ్డి కోరిక. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆ టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతోనే ఈయన తెలుగుదేశం వైపు వెళ్లారు.
ఆత్మకూరును బొల్లినేని కృష్ణయ్యకు కేటాయించాలని డిసైడ్ చేసిన చంద్రబాబు నాయుడు రాఘవేంద్ర రెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీచేయించాలని డిసైడ్ చేశారట.
నెల్లూరు ఎంపీ టికెట్ విషయంలో తెలుగుదేశం పార్టీలో నువ్వుంటే.. నువ్వు.. అనే పరిస్థితి ఉంది.
వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీచేయాలని ఆదాలకు సోమిరెడ్డి సూచించారు కొన్నాళ్ల కిందట.
తాము అంత సంపాదించలేదని.. మంత్రిగా సంపాదించిన వాళ్లే అక్కడ పోటీచేయాలని సోమిరెడ్డే అక్కడ పోటీ చేయాలని ఆదాల సమాధానం ఇచ్చారు ఒక మీటింగులో.
చివరకూ వీళ్లిద్దరూ నెల్లూరు ఎంపీ స్థానం నుంచి పోటీచేయడం లేదు. చివరకు రాఘవేంద్ర రెడ్డి వంటి చోటా నేతనే ఎంపీ బరిలోకి దించుతున్నారు.
ఇక నెల్లూరు అర్బన్ టికెట్ నారాయణకు ఖరారు అయినట్టేనని తెలుస్తోంది.
ఇక ఆరు పరాజయాల వీరుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈసారి సర్వేపల్లి నుంచి తన లక్ ను పరీక్షించుకోబోతున్నారు.