జవాన్ల….ఒకరి మృతి, శిథిలాల కింద మరో ఐదుగురు

జవాన్లపై విరిగిపడ్డ మంచు చరియలు.. ఒకరి మృతి, శిథిలాల కింద మరో ఐదుగురు
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఓ జవాన్ మరణించగా.. శిథిలాల కింద మరో ఐదుగురు చిక్కుకున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

1.ఇండియన్ ఆర్మీ జవాన్లపై విరిగిపడ్డ మంచు చరియలు.
2.ఒక జవాన్ దుర్మరణం, ప్రమాదంలో మరో ఐదుగురు.
3.సహాయ చర్యలకు ఇబ్బందులు..

ఉగ్రవాదులతో పాటు ప్రకృతి కూడా భారత సైన్యంపై పగబట్టినట్లు కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఆర్మీ జవాన్లపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఓ జవాన్ మృతి చెందగా మరో ఐదుగురు జవాన్లు మంచు చరియల కింద కూరుకుపోయినట్లు తెలుస్తోంది.

ఓ జవాన్ మృతదేహాన్ని బయటకి తీసినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా నంగ్మ్యా ప్రాంతంలో బుధవారం (ఫిబ్రవరి 20) ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వాతావరణం ప్రతికూలంగా ఉండటం, ఘటన జరిగిన ప్రాంతం అత్యంత ఎత్తులో ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఐటీబీపీ దళాలతో పాటు హిమాచల్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *