పోలవరం ప్రాజెక్టుకు….భూమిపూజ చేసి, నిధులు తెచ్చి కాలువలు తవ్వించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే…అందుకే పోలవరానికి ఆయన పేరు పెట్టాలంటున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు వైఎస్ పేరు పెట్టాలి.. వైసీపీ ఎంపీ కొత్త ప్రతిపాదన
పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది.. భూమిపూజ చేసింది వైఎస్ అని.. నిధులు తెచ్చి కాలువలు తవ్వించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డేనన్నారు. అందుకే పోలవరానికి ఆయన పేరు పెట్టాలంటున్నారు.

1.పోలవరం పేరు మార్చాలంటున్న వైసీపీ ఎంపీ
2.పోలవరం అనుమతులు తెచ్చింది వైఎస్
3.నిధులు తెచ్చింది, కాల్వలు తవ్వింది వైఎస్

ఏపీలో వైసీపీ అధికారం చేపట్టబోతోంది. ఈ నెల 30 ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత మంత్రివర్గం కొలువుదీరబోతోంది.

ఇక పూర్తిస్థాయిలో పాలనపై ఫోకస్ పెట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇక ప్రభుత్వాలు మారిన వెంటనే పాత పథకాలు, ప్రాజెక్టులు, ఎత్తిపోతలకు పేర్లు మార్చడం సాధారణంగా జరుగుతుంటుంది.

వైసీపీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పేరు మార్చాలంటున్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.

పోలవరం పేరును డాక్టర్ వైఎస్ఆర్ పోలవరం ప్రాజెక్టుగా మార్చాలని కోరారు.

పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చింది.. భూమిపూజ చేసింది వైఎస్ అని.. నిధులు తెచ్చి కాలువలు తవ్వించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డేనన్నారు.

అందుకే పోలవరానికి ఆయన పేరు పెట్టాలంటున్నారు. మరి బాలశౌరి డిమాండ్‌పై వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *