తిరగబడ్డ తమ్ముళ్లు.. మీడియాతో మాట్లాడుతూ మధ్యలోనే వెళ్లిపోయిన లక్ష్మీ పార్వతి…

లక్ష్మీ పార్వతిపై తిరగబడ్డ తమ్ముళ్లు.. ఎన్టీఆర్ ఘాట్‌లో చేదు అనుభవం
ఎన్టీఆర్ ఘాట్‌లో చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి విమర్శలు. తిరగబడ్డ తమ్ముళ్లు.. మీడియాతో మాట్లాడుతూ మధ్యలోనే వెళ్లిపోయిన లక్ష్మీ పార్వతి.

టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి పురస్కరించుకుని ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఘాట్‌లో ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. జగన్‌పై ప్రసంశలు కురిపిస్తూ.. టీపీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.

దీంతో ఆగ్రహానికి గురైన టీడీపీ కార్యకర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడాలని చంద్రబాబును విమర్శిస్తే ఊరుకోమన్నారు. జై చంద్రబాబు, జై తెలుగు దేశం అంటూ నినాదించారు.

దీంతో ఆమె మీడియాతో పూర్తిగా మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్ ఘాట్‌ను అలంకరించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడిదే. మహానాడు మానేశారు. ఘాట్ అలంకరణ మానేశారు.

ప్రభుత్వం పోయినా అల్లుడిగా ఘాట్‌ను అలకరించవచ్చు కదా? పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని బాగానే సంపాదించారుగా. రూ.10 లక్షలు పెట్టి ఘాట్‌ను అలంకరించలేరా? కనీసం బ్యానర్‌ కూడా పెట్టడకుండా ఎన్టీఆర్‌ను అతి దారుణంగా అవమానించారు. ఆయన ఓటమితో ఎన్టీఆర్ కక్ష తీర్చుకున్నారు.

ఆయన ఆత్మ చాలా సంతోషంగా ఉంది. ఆయన స్వర్గంలో ఎంత హ్యాపీగా ఉన్నారో కనిపిస్తోంది. చంద్రబాబు చేసిన పాపం, దుర్మార్గాల వల్ల తగిన శాస్తి జరిగింది. వచ్చే 15 ఏళ్ల వరకు జగన్ ముఖ్యమంత్రే. ఎన్టీఆర్, వైఎస్సార్ ఆశీస్సులతో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఆయన సరిదిద్దుతారు’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *