జనసేన పోరాట యాత్ర లో పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు
ప్రకాశం జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2 కోట్లు కూడా ఖాతాలో లేని సమయంలో పార్టీ పెట్టానని చెప్పారు. డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చంటే జగన్ ఐదుసార్లు సీఎం అయ్యేవారన్నారు.
ప్రకాశం జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
రూ.2 కోట్లు కూడా ఖాతాలో లేని సమయంలో పార్టీ పెట్టానని చెప్పారు.
డబ్బుతోనే రాజకీయాలు చేయొచ్చంటే జగన్ ఐదుసార్లు సీఎం అయ్యేవారన్నారు.
జనసేన పోరాట యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటిస్తోన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి సమాజంలో ముక్కు మూసుకొని బతకడం కంటే కళ్లు తెరిచి సమస్యలపై పోరాడుతూ బతకడం కష్టమని పవన్ తెలిపారు.
అంతా నేనే అనుకునే మీరు పది వేల మందిని తీసుకొని రాగలరా? అని జనసైనికులను పవన్ ప్రశ్నించారు.
నా బలం చూసి మీ బలం అంటే ఎలా? సెల్ఫ్ డిక్లరేషన్ వద్దు, 2009లో పీఆర్పీని ఇలాగే చంపేశారు అని జనసేనాని గుర్తు చేశారు.
బ్యాంక్ ఖాతాలో రూ.2 కోట్ల బ్యాలెన్స్ లేనప్పుడు పార్టీ పెట్టానన్న పవన్.. డబ్బుతో రాజకీయాలు చేయొచ్చనుకుంటే.. జగన్ ఇప్పటికే ఐదారుసార్లు సీఎం అయ్యేవారన్నారు.
పవన్తో పని లేదని లోకేష్ ఎక్కడో ఎక్కి కూర్చునే వారని జనసేనాని తెలిపారు
ప్రజలు ఓ బలమైన మార్పును కోరుకుంటున్నప్పుడు అది ఓ సునామీలా వ్యవస్థను తుడిచిపెట్టేస్తుందన్నారు.
పోటీ పరీక్షల పేరుతో ప్రభుత్వం కోట్లు దండుకుంటోందని పవన్ విమర్శంచారు. డీఎస్సీకి వయోపరిమితి పెంచుతామన్నారు. చదవాలంటే లక్షలు ఖర్చవుతోంది.
ఉద్యోగం కోసం లంచం ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో 38 లక్షల జనాభా ఉంటే 8 లక్షల మంది వలసవెళ్లారన్న జనసేనాని.. జిల్లాలో విలువైన ఖనిజ సంపద ఉన్నా ఉపాధి అవకాశాలు లేవన్నారు.
జనసేన నాయకులుగా చలామణి అవుతూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి క్రమశిక్షణ కోల్పోతే మాత్రం నేను నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తాను జాగ్రత్త అంటూ పవన్ హెచ్చరించారు.