ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నా.. రాయలసీమ ప్రజలకు మాటిచ్చిన పవన్
ఫ్యాక్షనిజం కోటలు బద్దలు కొడదాం. వారసత్వ పల్లకీలు మోసి భుజాలు ఒరుసుకుపోయాయి.
పల్లకీలు మోయడం ఆపేద్దాం. మీ అందరికీ నేనున్నానంటూ పవన్ చిత్తూరులో ఆవేశంగా ప్రసంగించారు.
1.రాయలసీమ యువతకు లక్ష ఉద్యోగాలు కల్పిస్తాం.
2.ఏ సీఎం చేయని తరహాలో సీమను అభివృద్ధి చేసి చూపిస్తాం.
3.రాయలసీమలో నాకు బలం లేదన్నారు. కానీ వారికేం తెలుసు నా బలం.
చిత్తూరు రోడ్ షోలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్.. ఫ్యాక్షనిజం కోటలను బద్దలు కొడతానని స్పష్టం చేశారు.
చిత్తూరుకు మంచి పేరు తేస్తామన్న ఆయన.. రాయలసీమలో బ్రిటిషర్ల కాలంలో ఎక్కువగా గ్రంథాలయాలు ఉండేవన్నారు.
ఇక్కడ రాజకీయ చైత్యనం ఎక్కువగా ఉండటానికి, ఎక్కువ మంది సీమ నేతలు సీఎంలు కావడానికి అదే కారణమన్నారు.
జనసేన లేకపోతే.. టీడీపీ, వైసీపీలు మన ఆర్థిక అభివృద్ధిని 60:40 చొప్పున పంచుకుంటున్నాయని విమర్శించారు.
చిత్తూరు జిల్లా హై రోడ్డుకు ఇంత అన్యాయం ఎందుకు జరుగుతోందని నిలదీశారు.
వారసత్వ పల్లకీలు మోసి భుజాలు ఒరుసుకుపోయాయి. పల్లకీలు మోయడం ఆపేద్దాం.
మీ అందరికీ నేనున్నా అంటూ పవన్ ఆవేశంగా ప్రసంగించారు.
‘‘రాయలసీమలో నాకు బలం లేదని చాలా మంది వెటకారం చేశారు.
నా బలమెంటో చెప్పడానికి మీరెవరు? నేను వారసత్వ రాజకీయాలు చేయడానికి రాలేదు.
ముక్కు ముఖం తెలియకున్నా, నాకు సంబంధం లేకున్నా.. భావజాలంతో నాకు సంబంధం ఉన్న వారికి అవకాశం ఇస్తాను.
2014లో అందరూ నన్ను భయపెట్టారు. ఎవరు సీఎం కావాలో ఇప్పటికే డిసైడ్ అయ్యింది.
ఇప్పుడొచ్చి నువ్వేం చేస్తావన్నారు. జగన్తో నాకు వైరం లేదని పవన్ తెలిపారు.
తెలంగాణలో నోరు విప్పితే మనపై దాడులు చేస్తారనే కారణంతో ఆంధ్రా నాయకులెవరూ నోరు మెదపలేదు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడటం కోసం జనసేన పార్టీని పెట్టాను.
అనుభవంతోనే ఏదైనా సాధించాలని, యువత, ఆడపడుచులకు అండగా నిలబడాలని రాజకీయాల్లోకి వచ్చాను. రూపాయి పెట్టుబడి లేకుండా జనబలాన్ని నమ్ముకొని వచ్చాను.
రాయలసీమలో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాయకుల పొలాలు పారుతున్నాయి.
కానీ సామాన్యుల పొలాలు పారడం లేదు. ఏడు కొండల వాడి సాక్షిగా, పీర్ బాబా సాక్షిగా చెబుతున్నా.. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేస్తాను.
నందికొట్కూరులో 500 గడపలకు నా ఇంటి పేరుంది. బాబు ఎంత చేశాడో లేదో నాకు తెలీదు.
అనంతపురంలో కియా ఒక్కటి పెట్టి చంకలు గుద్దుకుంటే ఎలా? పవన్ ప్రశ్నించారు.
‘రాయలసీమ అంటే లక్ష కోట్లు తినే నాయకులు కాదు.. లక్ష ఉద్యోగాలు కల్పించడమే జనసేన ధ్యేయం. సీమలో ఐటీకారిడార్ ఏర్పాటు చేస్తాం.
తెలంగాణ ప్రభుత్వంలా మాటలు చెప్పడం లేదు. చేసి చూపిస్తా’నని పవన్ తెలిపారు.
రాయలసీమ ముస్లింలలో వెనుకబాటుతనం ఎక్కువ. వారి ఆర్థిక అభివృద్ధికి అండగా ఉంటాం. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తాం.
కడపలో కేవలం రాజకీయ నాయకుల తోటల్లోనే అరటి తోటలున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులను తీసుకొస్తాను. ఇజ్రాయెల్ తరహాలో ఇక్కడ సేద్యం తీసుకొస్తాం.
బాబు వస్తే అమరావతిని డెవలప్ చేస్తారు, జగన్ వస్తే కడపను డెవలప్ చేస్తారు. మీరొస్తే ఎక్కడ డెవలప్ చేస్తారని ప్రశ్నించారు.
నేను మనవత్వాన్ని నిలబెడతా. మత గ్రంథాలు పట్టుకొని, మతాలను వేరు చేసి రాజకీయాలు చేయను అని పవన్ తెలిపారు.