తెదేపాలో చేరికపై స్పష్టత: కిశోర్ చంద్రదేవ్?
కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ తెదేపాలో చేరనున్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు.
సమావేశం ముగిసిన అనంతరం కిశోర్ చంద్రదేవ్ మీడియాతో మాట్లాడుతూ తెదేపాలో చేరికపై స్పష్టత ఇచ్చారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని.. త్వరలో తాను తెదేపాలో చేరనున్నట్లు తెలిపారు.
రాష్ట్రానికి తెదేపా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం భేటీలో ప్రస్తావనకు రాలేదని కిశోర్ చెప్పారు.
ఇటీవల విజయనగరం జిల్లా కురుపాంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు రాజీనామా చేసినట్లు అప్పుడే ప్రకటించారు.
కిశోర్ చంద్రదేవ్ తెదేపాలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆయనే స్వయంగా ప్రకటించించడంతో ఆ ప్రచారానికి తెరపడినట్లయింది. కిశోర్ చంద్రదేవ్ అరకు పార్లమెంట్ స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం