రిజర్వేషన్లు లేకుండానే ఆమె రాణించారు
నాగపూర్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు. రిజర్వేషన్ల అవసరం లేకుండానే ఇందిరాగాంధీ తన ప్రతిభను నిరూపించుకున్నారని , పురుష నాయకుల కంటే ఆమె ఎంతో గప్పగా పనిచేశారని కొనియాడారు. మహిళా రిజర్వేషన్లను తాను వ్యతిరేకించడం లేదని, కుల , మతాల ఆధారంగా రాజకీయాలు చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తూ న్నానని గడ్కరీ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన నాగ్ పూర్ లో మాహిళా స్వయంశక్తి సంఘాల ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తూ ఈ వాఖ్యలు చేశారు.
దేశంలో ఎమర్జెన్సీని విధించినందుకు ఇందిరాగాంధీ ని బీజేపీ విమర్శస్తుంటే.. మరో వైపు గడ్కరీ ఆమెను ప్రశంసించడం చర్చనీయాంశమయింది. కాంగ్రస్ పార్టీ లో ఇందిరాగాంధీ తన ప్రతిభను నిరూపించుకుని అంకితభావం కలిగిన పురుఘలకంటే ఎంతో గొప్పగా పనిచేశారు. ఇందుకు రిజర్వేషన్లు కారణమా? కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే , లోకసభ స్వీకర్ సుమిత్రా మహాజన్ లాంటి బీజేపీ నాయకులు కూడా రిజర్వేషన్ల అవసరం లేకుండానే చక్కగా రాణిస్తున్నారని గడ్కరీ అన్నారు.