సాగునీటి రంగంలో.. మేఘా వినూత్న ప్రక్రియ

సాగునీటి పారుదల రంగంలో భూములకు నీరందించేందుకు సరికొత్త పద్ధతికి  మేఘా ఇంజనీరింగ్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. ఆసియాలో తొలిసారిగా భారీ స్థాయిలో పైపుల ద్వారా నీరందించే పద్దతిని ప్రయోగాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అమలు చేస్తోంది. 

కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే తెలంగాణ ప్రభుత్వ .లక్ష్యానికి అనుగుణంగా ఎంఈఐఎల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పైప్లైన్ ఇరిగేషన్ అనే నూతన పధ్ధతిని అమలు చేస్తుందని మేఘా ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ బొంతు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 

కాలువల ద్వారా సాగు భూములకు నీరు అందించే పద్ధతి లో కాలువల ద్వారా సాగు భూములకు నీరు అందించే పద్ధతి లో నీటి వృథా ఎక్కువగా ఉంటునందున దానిని నివారించేందుకు పైపుల ద్వారా నేరుగా రైతుల పొలాలకే పైపులతో నీటిని సరఫరా చేసేలా పనులను ప్రయోగాత్మకంగా చేపడుతోంది. 

ఇంతవరకు సాగునీటి   ప్రోజెక్టుల క్రింద నేరుగా ఆయకట్టుకు నీరు అందించేందుకు ఎక్కడ ఏర్పాటు చేయని విధంగా 6,130 కిలోమీటర్ల పైపులైన్లను వ్యవస్యా భూముల్లో ఏర్పాటు మేఘా చేయనున్నారు.

తొలిసారిగా ‘మేఘా’ ఇజ్రాయిల్ పరిజ్ఞానం:

కాళేశ్వరం ప్రాజెక్టులో ఆసియాలోనే పెద్ద స్థాయిలో అవుట్ లెట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ (ఓఎమ్ఎస్) అనే ఇజ్రాయిల్ టెక్నాలజీ సహాయంతో పైప్ లైన్ ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ పనిచేస్తోంది.

కాళేశ్వరం ప్యాకేజీ-21గా పిలిచే ఈ ప్రాజెక్టులో  ఇజ్రాయిల్ లో బాగా ప్రాచుర్యం పొందిన ఔట్ లెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నది.  దీనివలన నీటి ఆవిరి నష్టంగాని, ఇంకుడు నష్టం గాని ఉండదు.

అలాగే భూసేకరణ అవసరం కూడా ఉండదు. ఇప్పటకే పైపుల ద్వారా సాగునీటి సరఫరా విధానం మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అమలులో ఉన్నప్పటికీ.. భారీ స్థాయిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం మాత్రం ఇదే తొలిసారి.

ఇప్పటికే పలు దేశాల్లో ఇలాంటి పైప్ లైన్ ఇరిగేషన్ వ్యవస్థకు మంచి ఆదరణ లభించింది.

ఈ పైపు ఏర్పాటు చేసేప్పుడు కొంత ఆటంకం కలిగినా ఆ తర్వాత ఆ పైపుపైన రైతులు యథావిధిగా సాగుచేసుకోవచ్చని బొంతు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ప్రెషరైజ్డ్ పైప్ లైన్ నెట్ వర్క్:

ప్రాజెక్టు ద్వారా మొత్తం 80 వేల హెక్టార్లకు సాగునీటిని అందించే వీలు కలుగుతుంది.

కొండం చెరువు, మంచిప్ప చెరువును అనుసంధానం చేసి రిజర్వాయర్ ను ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్టు విశిష్టత. మొత్తం 6,129 కిలోమీటర్ల ప్రెషరైజ్డ్ పైప్ లైన్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేయనున్నారు.

ఇందుకు ఎంఎస్, డీఐ, హెచ్డీపీఈ పైపులను వాడుతారు. పైపులైన్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమై పనులు వేగంగా జరుగుతున్నాయి.

150 కిలో మీటర్ల ఎంఎస్ పైప్ లైన్ లో ఇప్పటికే 11.4 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి.

అలాగే 282 కిలో మీటర్ల డీఐ పైప్ లైన్ పనుల్లో 10 కిలోమీటర్లను పూర్తిచేశారు.

ఈ ప్రాజెక్టు పూర్తయితే మెట్ పల్లి ప్రాంతంలో 46,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందించగలము.

అలాగే నిజామాబాదు జిల్లాలోని గడ్కోల్ పంప్ హౌజ్ ద్వారా నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని 34,000 హెక్టార్లకు సాగునీరు అందుతుంది.

మెట్ పల్లిలోని నిజాంసాగర్ కాలువపై 14.4 కిలోమీటర్ల వద్ద నిర్మించే పంప్ హౌజ్ నుంచి నీరు అందుతుంది.

గడ్కోల్ లో ‘మేఘా’ 3.5 టీఎంసీల రిజర్వాయర్:

నిజామాబాదు జిల్లాలోని గడ్కోల్ ప్రాంతంలో కొండంచెరువు, మంచిప్ప చెరువును అనుసంధానించడం ద్వారా 3.5 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించి ఆతర్వాత పంపింగ్ పనులను మేఘా ఇంజినీరింగ్ పూర్తి చేయనుంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా ఇంజినీరింగ్ రెండు పంపింగ్ స్టేషన్లను నిర్మించనుంది.

అందులో మొదటిది మెట్ పల్లి వద్ద ఒక్కోపంపు 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పది పంపులతో పంపింగ్ స్టేషన్ నిర్మించనుంది.

అలాగే గడ్కోల్ వద్ద 8 పంపులతో ఒక్కో పంపు 2 మెగావాట్ల సామర్థ్యంతో రెండవ పంపింగ్ స్టేషన్ నిర్మించనుంది.

ఓఎంఎస్ తో మంచి దిగుబడులు:

భారీ ఎత్తిపోతల పథకాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే భవిష్యత్తులో పైపుల ద్వారానే సాగునీటిని అందించడమే ఉత్తమ మార్గమని, నీటి వృథాను అరికట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పైప్ ఇరిగేషన్ ద్వారా చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందించవ్చని, ఈ విధానం ద్వారా దిగుబడులు పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

కాళేశ్వరంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన పైప్ లైన్ ఇరిగేషన్ విజయవంతంమైతే ఇతర ప్రాంతాలో కూడా ఇలాంటి ప్రాజెక్ట్లు ఏర్పాటు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *